యాప్నగరం

చంద్రబాబూ బిగ్గరగా ఏడవండి.. విజయసాయి సెటైర్లు

TDP అధినేత చంద్రబాబు నాయుడిపై విజయసాయి సెటైర్లు వేశారు. బిగ్గరగా ఏడవండంటూ బాబుపై విమర్శలు గుప్పించారు. అనుభవం ఉన్న నేత అని గెలిపిస్తే బాబు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావన్నారు.

Samayam Telugu 1 Oct 2019, 12:30 pm
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వరుస ట్వీట్లతో బాబుపై విరుచుకుపడ్డారు. కోడెల స్మారక సభలో కూడా చంద్రబాబు రివర్స్ టెండరింగ్‌నే కలవరించారని విజయసాయి ఎద్దేవా చేశారు. ‘‘గతంలో రూ. 650 కోట్లు ఎక్కువ కోట్ చేసిన మేఘా ఇప్పుడు తక్కువకు ఎలా కోట్‌ చేస్తుందని గగ్గోలు పెడుతున్నాడు. కమిషన్ల కోసం కక్కుర్తి పడింది మీరే కదా. ఇప్పుడు ఎవరికీ రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు, అదీ తేడా’’ అని చంద్రబాబు నాయుణ్ని ఉద్దేశించి విజయసాయి ట్వీట్ చేశారు.
Samayam Telugu vijayasai babu


అనుభవజ్ఞుడని నమ్మి ప్రజలు గెలిపిస్తే బాబు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావని విజయసాయి ఆరోపించారు. ఎన్టీపీసీ సహా విద్యుత్తు సంస్థలకు రూ. 20 వేల కోట్లపైనే బకాయిలు కావడానికి బాబు కారణమయ్యారని విమర్శించారు. జెన్‌కోను ధ్వంసం చేసి ప్రైవేటుకు దోచిపెట్టాడు. డిస్కమ్‌లను అప్పుల్లో ముంచి ఇప్పుడు చీకటి రోజులొచ్చాయని దొంగ ఏడుపు మొదలెట్టాడంటూ సెటైర్లు వేశారు.

‘ఒక్క నోటిఫికేషన్‌తో 1.27 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఇక ప్రతి ఏటా నియామకాలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ప్రకటించారు. చంద్రబాబూ బిగ్గరగా ఏడవండి. మీ శాపనార్థాలు నిరుద్యోగులకు ఆశీర్వాదాలుగా మారతాయి. రూ. 1000 నిరుద్యోగ భృతి రోజులు పోయి ఉద్యోగులుగా గర్వించే రోజులు వచ్చాయ’ని విజయసాయి ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.