యాప్నగరం

ట్రైలర్‌కే ఈలలు వేస్తే ఎట్లా.. యాక్షన్ సీన్లు ముందున్నాయ్, ఓపికపట్టండి.. ఎంపీ సంచలనం

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, అశోక్ గజపతిరాజు స్నేహబంధంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Samayam Telugu 20 Jun 2021, 4:44 pm
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అంటేనే విరుచుకుపడే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి రెచ్చిపోయారు. విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజును తిరిగి నియమించాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తరుణంలో సీరియస్ కామెంట్స్ చేశారు. అశోక్ గజపతి, చంద్రబాబును ఉద్దేశించి విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu అశోక్ గజపతి రాజు, చంద్రబాబు


పదవుల కోసం అశోక్ గజపతి మాన్సాస్ ట్రస్టును చంద్రబాబుకు తాకట్టు పెట్టారని విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇద్దరూ కలిసి భూముల్ని అమ్ముకుని పంచుకున్నారని వ్యాఖ్యానించారు. ట్రైలర్లకే ఈలలు వేసి హంగామా చేస్తే ఎట్లా.. కాస్త ఓపిక పట్టండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆదివారం విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు.

‘‘పదవుల కోసం అశోక్ గజపతి మాన్సాస్ ట్రస్టును బాబుకు తాకట్టు పెట్టాడు. ఇద్దరూ కలిసి భూముల్ని అమ్ముకుని పంచుకున్నారు. నిప్పు, ఉప్పు అని చెప్పుకునే వ్యక్తుల బండారం త్వరలోనే బయటపడుతుంది. తప్పు చేసి తప్పించుకోలేరు. అన్నిటికి టైం వస్తుంది.


అసలు సినిమాను వదిలి ఇంటర్వెల్లో వచ్చే ట్రెయిలర్లకు ఈలలు వేసి హంగామా చేసే టైపు బాబు అండ్ కో ది. సినిమాలో యాక్షన్ సీన్లు ఇంకా మిగిలే ఉన్నాయి. ఇక్కడ ఇంటర్వెల్ ఉండదు. ముగింపే ఉంటుంది. అప్పటి దాకా కాస్త ఓపిక పట్టండి.’’ అంటూ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.