యాప్నగరం

కర్ణుడిని కౌరవులు డబ్బుతో కొనేశారు.. విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 24 Jul 2021, 6:20 pm
తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. వీరిద్దరిని ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు, లోకేష్‌ను కౌరవులతో పోలుస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Samayam Telugu విజయసాయిరెడ్డి


కౌరవులు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉన్నవారి పతనం కోసమే ప్రయత్నించారని.. ఇప్పుడు చంద్రబాబు, లోకేస్ వారి వారసులుగా తయారయ్యారని వ్యాఖ్యానించారు. కర్ణుడిని కౌరవులు డబ్బు, రాజ్యం పెట్టి కొనేశారని.. అలాగే చంద్రబాబు సైతం గతంలో ఎమ్మెల్యేలను కొనుక్కున్నారని సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు శనివారం విజయసాయిరెడ్డి వరుస ట్వీట్ చేశారు.

‘‘ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉన్నవారి పతనం కోసమే ప్రయత్నించారు కౌరవులు. కర్ణుడులాంటి వారు దొరికితే వెంటనే డబ్బు, రాజ్యం పెట్టి కొనేశారు. ఇప్పుడు కూడా వారి వారసులున్నారు. గతంలో ఎమ్మెల్యేలను కొనుక్కున్నారు. ఎవరితోనైనా పొత్తుకు రెడీ అంటారు ‘కుట్రబాబు’, ‘ఉత్త’ర కుమారుడు లోకేశం.’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.