యాప్నగరం

వస్త్రాలు విడిచి పారేసి నగ్నంగా, తుపుక్కున ఉమ్మేసినా.. రెచ్చిపోయిన విజయసాయిరెడ్డి

Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు.

Samayam Telugu 23 Jan 2021, 3:09 pm
తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి చెలరేగిపోయారు. చంద్రబాబును టార్గెట్‌గా చేసుకుని పరుష పదజాలంతో రెచ్చిపోయారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలపై పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న తరుణంలో చంద్రబాబుపై దారుణమైన కామెంట్లు చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి శనివారం చేసిన ట్వీట్లు సంచలనం రేపుతున్నాయి. చంద్రబాబుపై విజయసాయి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సంస్కారపు వస్త్రాల్ని విడిచి పారేసి ‘నగ్నంగా’ చెలరేగిపోతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu విజయసాయిరెడ్డి


‘‘రాజకీయ అవసాన దశలో సభ్యత, సంస్కారపు వస్త్రాల్ని విడిచి పారేసి ‘నగ్నంగా’ చెలరేగిపోతున్నాడు చంద్రబాబు. కళ్లు, చెవులు మూసుకొని అయ్యో అనడం మినహా చేయగలిగేది ఏమీ లేదు. ప్రజలైతే ఎప్పుడో తుపుక్కుమని ఊమ్మేసి బాబును పట్టించుకోవడం మానేశారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని వికృత చేష్టలు చూపిస్తాడో!’’ అంటూ చంద్రబాబుపై విజయసాయి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
అలాగే ‘‘నీతి, న్యాయం, సిగ్గు, లజ్జలను గాలికొదిలిన వ్యక్తి ధర్మ పరిక్రమ యాత్ర అంటూ పిలుపునివ్వడం దిగజారుడుకు పరాకాష్ట. జనం ఉమ్మేస్తారన్న భయం కూడా లేకుండా దబాయింపులకు దిగుతున్నాడు. గుళ్లను కూల్చి, దేవతా మూర్తులను అపవిత్రం చేస్తూ ధర్మం గురించి సుద్దులు చెప్పడం ఇంకెవరి వల్లా కాదు బాబూ.’’ అంటూ మరో ట్వీట్లలో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబుపై విజయసాయి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.