యాప్నగరం

ఏపీలో శవాల దిబ్బలు కనిపించాలని దేవుళ్లకు మొక్కుతున్నారు.. పిశాచాల కంటే క్రూరంగా.. వైసీపీ ఎంపీ సంచలనం!

ఆంధ్రప్రదేశ్‌లో శవాల దిబ్బలు కనిపించాలని చంద్రబాబు, లోకేష్ దేవుళ్లకు మొక్కుతున్నారని వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 5 May 2021, 6:41 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి కట్టడి విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న వారిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై ట్విటర్‌ వేదికగా విజయసాయిరెడ్డి మండిపడ్డారు. పిశాచాల కంటే క్రూరాతి క్రూరంగా తండ్రీకొడుకులు ఆలోచనలు ఉన్నాయని దుయ్యబట్టారు. దేశమంతా మహమ్మారి అదుపులోకి వచ్చినా ఏపీలో మాత్రం శవాల దిబ్బలు కనిపించాలని ‘వాళ్ల దేవుళ్లకు’ మొక్కుతుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు.
Samayam Telugu చంద్రబాబు, లోకేష్


‘‘రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలని తండ్రీ కొడుకులు ఎన్నడూ కోరుకోరు. జగన్ గారు విఫలమయ్యారని ఏడవడానికి, దేశమంతా మహమ్మారి అదుపులోకి వచ్చినా ఏపీలో మాత్రం శవాల దిబ్బలు కనిపించాలని ‘వాళ్ల దేవుళ్లకు’ మొక్కుతుంటారు. పిశాచాల కంటే క్రూరాతి క్రూరంగా ఉంటాయి వీళ్ల ఆలోచనలు.
పాపాలు చేసిన వారిని దేవుడు క్షమిస్తాడేమో కానీ.. తమను నిలువునా దోచుకుని, మాఫియా పాలనతో పీడించిన బాబులాంటి వారిని ప్రజలు అస్సలు మన్నించరు. వరస పరాజయాలు అందుకే. నిజాయితీ విలువ తెలియని వ్యక్తులు పరాజయాల భారం కింద నలిగిపోక తప్పదు.

కరోనా నియంత్రణ, పరీక్షలు, వైద్య రంగ మౌలిక సదుపాయాల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది రాష్ట్రం. అయినా మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయిన బాబు, అద్దె మైకులు, అను’కుల మీడియా రాద్దాంతం కొనసాగుతూనే ఉంది. కష్ట కాలంలో బాధ్యత లేకుండా వ్యవహరించినందుకు ప్రజలు తప్పక బుద్ధి చెబుతారు.’’ అని విజయసాయిరెడ్డి ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.