యాప్నగరం

వాహ్! ఏం కటింగులు బాబూ.. ఆ తప్పుకు క్షమాపణలు కోరి, మనిషివి అనిపించుకో.. ఎంపీ సంచలనం!

TDP: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Samayam Telugu 29 Aug 2021, 11:04 pm
తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. చంద్రబాబును ఉద్దేశించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు, ప్రభుత్వం మీద విమర్శలు చేయడంపై విజయసాయి ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. రైతులపై నీవు జరిపించిన మారణహోమానికి బషీర్ బాగ్ వెళ్లి పశ్చాతాపం వ్యక్తం చేయి బాబూ అంటూ డిమాండ్ చేశారు. ఆనాటి తప్పుకు క్షమాపణలు కోరి మనిషివి అనిపించుకోవాన్నారు. అలాగే, ప్రభుత్వంపై రాళ్లు రువ్వడమంటే జనం తలలు పగలగొట్టడమేనని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ఆదివారం వరుస ట్వీట్లు చేశారు.
Samayam Telugu చంద్రబాబునాయుడు


‘‘వాహ్!...ఏం కటింగులు బాబూ. ప్రజల కోసం పనిచేస్తున్నట్టు ఎల్లోమీడియా సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటోంది. దోచుకున్న లక్షల కోట్ల ప్రజా ధనం నుంచి బాబు విసిరే చిల్లర కోసం అలుపు తెలియకుండా శ్రమిస్తున్న సంగతి దేవ రహస్యమేమీ కాదు. ప్రభుత్వంపై రాళ్లు రువ్వడమంటే జనం తలలు పగలగొట్టడమే.

రైతులపై నీవు జరిపించిన మారణహోమానికి బషీర్ బాగ్ వెళ్లి పశ్చాతాపం వ్యక్తం చేయి బాబూ. కరెంటు చార్జీలు తగ్గించమని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై తూటాల వర్షం కురిపించి అనేక మందిని పొట్టన పెట్టుకున్నావు. ఆనాటి తప్పుకు క్షమాపణలు కోరి మనిషివి అనిపించుకో.

50 వేల మంది ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులో విలీనం చేయడమే ఒక సాహసమైతే వారందరికి బీమా భద్రత కల్పిస్తూ జగన్ గారి ప్రభుత్వం ఎస్బీఐతో ఒప్పందం కుదుర్చుకోవడం విప్లవాత్మక కార్యక్రమం. ఆర్థిక ఒడిదుడుకులున్నా సిఎం గారి సంకల్పం, కార్యదీక్ష సడలవు.’’ అని విజయసాయిరెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.