యాప్నగరం

నీ బాగోతాలన్నీ బయటకొస్తాయ్.. నీతిమంతుడి ముసుగులో అరాచకాలు.. ఎంపీ షాకింగ్ కామెంట్స్!

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన నీతిమంతుడి ముసుగులో అరాచకాలు చేశారంటూ..!

Samayam Telugu 21 Jun 2021, 5:52 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి రెచ్చిపోయారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు స్నేహ బంధాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అశోక్ గజపతిరాజు పదవుల కోసం చంద్రబాబుకు మాన్సాస్ ట్రస్టును తాకట్టుపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తులో అశోక్ గజపతి బాగోతాలన్నీ బయట పడతాయని, శిక్ష నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి సోమవారం వరుస ట్వీట్లు చేశారు.
Samayam Telugu అశోక్ గజపతి రాజు, చంద్రబాబు


ట్రైలర్‌కే ఈలలు వేస్తే ఎట్లా.. యాక్షన్ సీన్లు ముందున్నాయ్, ఓపికపట్టండి.. ఎంపీ సంచలనం
‘‘దర్యాప్తులో నీ బాగోతాలన్నీ బయట పడతాయి అశోక్. రికార్డులు, సాక్ష్యాలు మాయం చేసినంత మాత్రాన నిప్పు అయిపోవు. పదవుల కోసం మాన్సాస్‌ను బాబుకు తాకట్టు పెట్టావు. ఇప్పటికే ప్రజా ‘కోర్టు’లో శిక్షపడింది. అప్పన్నకు ద్రోహం చేస్తే పది తరాలైనా పాపం వెంటాడుతుంది. తప్పించుకోలేవు.

కోటిపల్లి భూముల్లో ఇసుక అమ్ముకుని ‘మేటలు తొలగించా’నని అనడం ‘తాటిచెట్టు ఎక్కింది దూడ గడ్డికోసమని’ బుకాయించినట్టుగా ఉంది. ఎవరో తవ్వుకుపోతే నువ్వేం చేశావు. నీ యజమాని బాబుకు ముట్టాయా, నీకే దక్కాయా ముడుపులు? నీతిమంతుడినని జనం కళ్లుగప్పి చేయని అరాచకాలే లేవు అశోక్.

నీ వివరణల్లో నిజాయితీ మచ్చుకు కూడా కనిపించడం లేదు. బొంకడం నేర్చాక అబద్ధాలు అనేక రూపాల్లో చూపే విద్యా అబ్బుతుంది అశోకా. ఎన్టీఆర్ వెన్నుపోటు కుట్రలో బాబుకు కత్తి అందించినప్పుడే వ్యక్తిగా పతనమయ్యావ్. ఆ ముఠాలో నీవు నడిపించిన కథలన్నీ బయటికొచ్చే టైం వచ్చింది.’’ అంటూ విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.