యాప్నగరం

బాబు కోవర్టుల కంట్రోల్‌లోకి ఏపీ బీజేపీ.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు

ఏపీ బీజేపీ క్రమంగా చంద్రబాబు కోవర్టుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. పార్టీపై పట్టు తెచ్చుకునే పనిలో ఉన్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

Samayam Telugu 14 Sep 2019, 4:07 pm
ఏపీ బీజేపీ నేతలు టార్గెట్‌గా వైఎస్సార్సీపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోవర్టులు నెమ్మదిగా బీజేపీ రాష్ట్ర శాఖను కంట్రోల్ చేసే స్థాయికి వచ్చారని విమర్శించారు. బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, కార్యవర్గాన్ని పక్కకు నెట్టి కొద్దికొద్దిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని, పోలవరం విషయంలో ప్రభుత్వ తీరు సరిగ్గా లేదని గవర్నర్‌కి ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
Samayam Telugu pjimage (56)


Must Read : జగన్ బాబాయి ఇంటికి అఘోరాలు..

కన్నా లక్ష్మీనారాయణ, ఇతర కార్యదర్శులు కూడా లేకుండానే బీజేపీ నేతల బృందం గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచంద్‌ని కలిసిందని విజయసాయి అన్నారు. బీజేపీపై కంట్రోల్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారని, ఆ విషయం గవర్నర్‌ని కలిసిన సుజనా చౌదరి బృందాన్ని చూస్తే అర్థం అవుతోందన్నారు. బాబు బానిసలకు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కంటే చంద్రబాబే ముఖ్యమని ఘాటుగా విమర్శించారు.

Also Read : ల్యాప్‌ట్యాప్‌ల మాయం కేసు.. కోడెల కుమారుడి కోసం పోలీసుల గాలింపు

వైఎస్ జగన్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు గవర్నర్‌కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. దాని వల్ల రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతాయన్నారు. రాజధాని అమరావతి విషయంలోనూ ప్రభుత్వం ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రుల ప్రకటనలతో గందరగోళం ఏర్పడిందన్నారు. ఈ విషయాలపై సీఎం వైఎస్ జగన్ స్పందించడం లేదని విన్నవించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.