యాప్నగరం

ఏపీ రాజకీయాల్లో దుమారం.. ఆ నాలుగో బిగ్ బాస్ ఎవరంటే.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో బీజేపీ ముఖ్య నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ భేటీ కావడం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది.

Samayam Telugu 23 Jun 2020, 3:46 pm
ఏపీ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో ఏపీ బీజేపీ కీలక నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ రహస్యంగా భేటీ కావడంపై రాజకీయ దుమారం రేగుతోంది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఇద్దరు బీజేపీ పెద్దల్ని నిమ్మగడ్డ కలవడం.. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ముగ్గురు ఈ నెల 13న ఒకరి తర్వాత మరొకరు హోటల్‌కు వెళ్లారు.. దాదాపు గంట పాటు ఈ సమావేశం జరిగింది.
Samayam Telugu సుజనా చౌదరి, కామినేని, నిమ్మగడ్డ రమేష్


ఈ వ్యవహారం బయటకు రావడం రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా, ఈ వ్యవహారంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పార్క్ హయత్‌లో కమ్మనైన ప్రజాస్వామ్యం. దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు. ఫేస్ టైంలో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరు? మరిన్ని వివరాలు అతి త్వరలో..’’ అంటూ సంచలన ట్వీట్ చేశారు. అయితే విజయసాయిరెడ్డి చెప్పిన ఈ నాలుగో వ్యక్తి ఎవరనేది తీవ్ర చర్చనీయాంశమైంది.

కాగా, నిమ్మగడ్డ రమేష్ కేసులో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టులో హైకోర్టు తీర్పుపై ప్రభుత్వానికి స్టే ఇవ్వకుండా కేవియెట్ వేశారు. ఇలాంటి సమయంలో సుజనా చౌదరి, కామినేనిని రమేష్ కుమార్ సమావేశంకావడం చర్చనీయాంశమవుతోంది. ఈ భేటీకి సంబంధించిన అంశంపై ఇప్పటి వరకూ ఎవరూ స్పందించలేదు. దీంతో వైసీపీ నేతలు ఈ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును సైతం టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.