యాప్నగరం

బంగారు బాతంటే ఇదన్నమాట! ఏపీ రాజధానిపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు

రాజధాని అమరావతి బంగారు బాతు అంటే ఇప్పుడే అర్థమైంది. ఇన్‌కంట్యాక్స్ దాడులతో బొంకులన్నీ బయటకొస్తున్నాయ్. ఢిల్లీ వెళ్లిన నిత్యకళ్యాణం ఏ భాషలో మాట్లాడుతున్నాడో అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు, పవన్‌పై ఘాటు విమర్శలు చేశారు.

Samayam Telugu 17 Nov 2019, 3:46 pm
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌‌ను మరోసారి టార్గెట్ చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. రాజధాని అమరావతి.. ఇంగ్లిష్ మీడియం అంశాలను పేర్కొంటూ విమర్శలు గుప్పించారు. వల్లభనేని వంశీ వ్యవహారంపైనా స్పందించారు. మాలోకం మాటలు ఎవరూ పట్టించుకోలేదంటూ నారా లోకేష్‌పై సెటైర్లు పేల్చారు. వరుస ట్వీట్‌లతో విరుచుకుపడ్డారు.
Samayam Telugu amaravathi


టీడీపీకి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారంపై విజయసాయి ఘాటుగా స్పందించారు. వంశీ వదిలిన సవాళ్లకు తెలుగుదేశం పార్టీ జవాబిచ్చే పరిస్థితిలో ఉందా? అంటూ ఎద్దేవా చేశారు. మాలోకం ఏదో అన్నాడు కానీ ఎవరూ పట్టించుకోలేదంటూ మాజీ మంత్రి నారా లోకేష్‌ను టార్గెట్ చేశారు. టీడీపీ మునిగిపోయే పార్టీ అని అందరికీ అర్థమైందన్నారు. చివరకు తండ్రీకొడుకు, తోక పార్టీ దత్తపుత్రుడు మాత్రమే మిగులుతారని.. ఎల్లో మీడియా కూడా షాక్ నుంచి తేరుకోనట్టుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Read Also: రచ్చరచ్చ చేసిన రేసుగుర్రం.. భారీగా పోలీసుల మోహరింపు.. శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్తం

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని పవన్‌ కళ్యాణ్ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎంపీ విజయసాయి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని, జాతీయ జెండా రూపకర్త నెహ్రూ.. స్వాతంత్య్రం 1940లో వచ్చిందని చెప్పి అజ్ణానాన్ని బయట పెట్టుకున్న నిత్యకళ్యాణం ఢిల్లీ వెళ్లి ఏ భాషలో మాట్లాడుతున్నాడో.’ అంటూ సెటైర్లు వేశారు. హిందీ, ఇంగ్లిష్ రాకుంటే అక్కడ హోటల్‌లో భోజనం కూడా ఆర్డర్ ఇచ్చుకోలేమని ఎద్దేవా చేశారు.

Also Read: చెంప చెళ్లుమనిపించిన ఎస్సై.. తిరిగికొట్టిన గొర్రెల కాపరి.. అసలేమైందంటే!

ఏపీ రాజధాని అమరావతి బంగారు బాతు అని.. దానిని చంపేశారని చంద్రబాబు ఎందుకు శోకాలు పెడుతున్నారో ఇప్పుడే అర్థమైందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు కమీషన్లకు తెరతీశారని.. ఆ భాగోతం ఇప్పుడిప్పుడే బయటపడుతోందని విమర్శించారు.

ఆదాయ పన్ను శాఖ బాబు బొంకులను బయటపెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. అమరావతిలో తాత్కాలిక భవనాల కాంట్రాక్టు పొందిన సంస్థ రూ.500 కోట్లు ముట్ట చెప్పిందని ఇన్‌కంట్యాక్స్ బయట పెట్టిన తర్వాత లింకులు, బొంకులన్నీ ఒక్కటొకటిగా వెలుగు చూస్తున్నాయని వ్యాఖ్యానించారు.

Read Also: పవన్‌ని అలా అన్నాక ఆలోచించుకున్నా.. సాదినేని యామిని సంచలన వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.