యాప్నగరం

దేశంలోనే అతి పెద్ద స్కామ్.. చంద్రబాబు, అశోక్ మధ్య డీల్.. ఎంపీ షాకింగ్ విషయాలు!

తెలుగు దేశం అధినేత చంద్రబాబునాయుడు, అశోక్ గజపతిరాజు స్నేహాన్ని ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 20 Jul 2021, 7:24 pm
తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. వీరిద్దరి స్నేహబంధంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. పదవుల విషయంలో చంద్రబాబు, అశోక్ గజపతి రాజు మధ్య డీల్ కుదిరిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Samayam Telugu అశోక్ గజపతి రాజు, చంద్రబాబు


కేంద్ర మంత్రి పదవి కోసం అశోక్ గజపతి.. రూ. వేల కోట్ల విలువైన మాన్సాస్ భూముల కోసం చంద్రబాబు డీల్ కుదిరించుకున్నారని వ్యాఖ్యానించారు. ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని పేర్కొన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి మంగళవారం వరుస ట్వీట్లు చేశారు.


‘‘అశోక గజపతి, చంద్రబాబు మధ్య డీల్‌ ఏమిటంటే.. ఆయనకేమో కేంద్ర మంత్రి పదవిపై వ్యామోహం. ఈయన కళ్లేమో వేల కోట్ల మాన్సాస్ భూములపై పడ్డాయి. విజయవాడ నుంచి కుటుంబరావు అనే విశ్వాసపాత్రుడిని మాన్సాస్‌ ట్రస్ట్‌ మెంబర్‌ చేయించాడు బాబు. భూముల హారతి అలా మొదలైంది. దేశంలోనే అతి పెద్ద స్కామ్ ఇది.’’ అని విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.