యాప్నగరం

నీ పాలన ఇదేనా అశోక్ గజపతి? మాన్సాస్‌లో చంద్రబాబు చుట్టాలు, భారీ భూదందా.. ఎంపీ సంచలనం

టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 4 Aug 2021, 4:01 pm
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే చంద్రబాబు, అశోక్ గజపతిరాజుల మధ్య ఉన్న స్నేహ బంధంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. గజపతి రాజులకు సంబంధించిన మాన్సాస్‌ ట్రస్ట్‌లో భూకుంభకోణాలు కప్పిపుచ్చుకునేందుకే ఉద్యోగులను ఉసిగొల్పుతున్నారని అశోక్ గజపతిపై ఆరోపణలు గుప్పించారు.
Samayam Telugu అశోక్ గజపతి రాజు, చంద్రబాబు


మాన్సాస్‌లో 295 ఎకరాల భూములపై స్పష్టతలేదని, 150 ఎకరాల విక్రయాల్లో తేడాలున్నట్లు విజయసాయిరెడ్డి ఆరోపించారు. అలాగే చంద్రబాబు, అశోక్ గజపతి మధ్య భూదందా జరిగిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చుట్టాలను మాన్సాస్‌లో ప్రవేశపెట్టి మరీ భూదందా చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఇదేనా నీ పాలన అశోక్? చేసిందే నువ్వైతే ఈఓకు లేఖలు రాయడం ఏమిటంటూ ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి బుధవారం ట్వీట్ చేశారు.


‘‘మాన్సాస్‌లో భూకుంభకోణాలు కప్పిపుచ్చుకునేందుకు ఉద్యోగులను ఉసిగొల్పుతున్నాడు అశోక్. మాన్సాస్ 295 ఎకరాల భూములపై స్పష్టతలేదు. 150 ఎకరాల విక్రయాల్లో తేడాలు. చంద్రబాబు చుట్టాలను మాన్సాస్‌లో ప్రవేశపెట్టి మరీ భూదందా చేశారు. ఇదేనా నీ పాలన అశోక్? చేసిందే నువ్వైతే ఈఓకు లేఖలు రాయడం ఏమిటి?’’ అంటూ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.