యాప్నగరం

‘వాతలు తేలేలా కొట్టుకున్నా.! డ్యామేజీ జరిగిపోద్ది’ విజయసాయి హెచ్చరికలు ఆయనకేనా.?

వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. బాబు మాయలో పడితే జరిగే నష్టం ఆలస్యంగా అర్థమవుతుందని.. అప్పటికి డ్యామేజీ జరిగిపోతుందంటూ పరోక్ష హెచ్చరికలు చేశారు.

Samayam Telugu 6 Jun 2021, 3:17 pm
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై మరోమారు ఘాటు విమర్శలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. చంద్రబాబుతో అంటకాగితే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని.. ఆ విషయం ఆలస్యంగా అర్థమవుతుందని విజయసాయి అన్నారు. బాబు మాయలో పడి పోతురాజులా కొరడాతో వాతలు తేలేలా కొట్టుకున్నా.. ఎవరో ఉసిగొల్పితే పిచ్చి చేష్టలు చేసి ఒళ్లు హూనం చేసుకున్నామని ఆలస్యంగా అర్థమవుతుందన్నారు. అప్పుడు పశ్చాత్తాప పడినా అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతుందని పరోక్ష హెచ్చరికలు చేశారు. ఎంపీ రఘు రామకృష్ణ రాజు వ్యవహారం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎంపీ రఘురామకే పరోక్షంగా హెచ్చరికలు చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
vijayasai


అంతటితో ఆగని విజయసాయి టీడీపీ అధినేత చంద్రబాబుపైనా విమర్శలు చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీది ఎప్పుడూ దొంగ చూపేనని విమర్శించారు. లిటిగేషన్లతో ప్రభుత్వాన్ని దొంగ దెబ్బ కొట్టాలని చూస్తుంటాడని.. లిటిగెన్సీని నమ్ముకుని ఎవరూ బాగుపడ లేదని చరిత్ర చెబుతోందని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రజలకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకోవాలని సీఎం జగన్ ముందుచూపుతో వ్యవహరిస్తుంటారని ఆయన అన్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.