యాప్నగరం

ఆయనో గుండుసున్నా.. పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎంపీ ఘాటు విమర్శలు

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన స్వగ్రామంలో పర్యటించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై ఘాటుగా స్పందించారు.

Samayam Telugu 17 Jan 2020, 6:22 pm
బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై మరోసారి ఘాటు విమర్శలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. పవన్ కళ్యాణ్ కేవలం నటుడు మాత్రమేనంటూ విమర్శలు చేశారు. స్క్రిప్ట్ చేతికందించేది.. డైరెక్ట్ చేసేది ఆయనేనంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. పవన్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా వారి వెనుక ఉండేది చంద్రబాబేనని ఆయన అన్నారు.
Samayam Telugu Pawan-kalyan


‘యాక్టర్ నిమిత్త మాత్రుడు. నడిపించేది, వెనక నుంచి నెట్టేది, డైరెక్ట్ చేసేది, స్క్రిప్ట్ చేతి కందించేది, పేమెంట్ ఇచ్చేది యజమాని స్థానంలో ఉన్న 40 ఇయర్స్ ఇండస్ట్రీనే. కమ్మూనిస్టులతో కలిసినా, బిఎస్పీ కాళ్లు పట్టుకున్నా, కమలం వైపు కదిలినా ఆదేశించేది’ ఆయనేనంటూ విజయసాయి రెడ్డి ఘాటుగా ట్వీట్ చేశారు.

Also Read:
సీఎం జగన్‌కు చుక్కెదురు.. సీబీఐ కోర్టు షాకింగ్ డెసిషన్

జనసేనాని పవన్‌‌ని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. ఆయనో సున్నా అని.. ఆ సున్నా ఎవరితో కలిసినా.. తీసివేసినా మిగిలేది జీరోనేనంటూ తీవ్రంగా విమర్శించారు. ‘గుండు సున్నా దేనితోనైనా కలిసినా, విడిపోయినా ఫలితం జీరోనే. సున్నాను తలపైన ఎత్తుకున్నా, చంకలో పెట్టుకున్నా జరిగేదదే. ఇది పదేపదే నిరూపితమవుతూనే ఉంటుంది. అయినా ప్రయోగాలకు సాహసించే వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. దెబ్బతింటుంటారు. మనం పాపం అనుకుంటూ వదిలేయాలి’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

ఎంపీ విజయసాయి రెడ్డి ఈ రోజు సొంత జిల్లా నెల్లూరులో పర్యటించారు. ఆయన స్వగ్రామం ముత్తుకూరు మండలంలోని తాళ్ళపూడిలో15 కోట్ల రూపాయాల వ్యయంతో తలపెట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే వెంకటాచలం మండలం గొలగమూడిలోని భగవాన్‌ వెంకయ్యస్వామి ఆశ్రమంలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read Also: గుంటూరు ప్యాసింజర్‌ క్యాన్సిల్.! అప్పటి వరకూ అంతే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.