యాప్నగరం

అదీ బాబు పాద మహిమ! విజయసాయి ఘాటు విమర్శలు

చంద్రబాబు పాద మహిమతో జలవిద్యుత్ కేంద్రాలు పడకేశాయి. ప్రస్తుతం రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. జల విద్యుత్ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయని విజయసాయి అన్నారు.

Samayam Telugu 3 Oct 2019, 1:27 pm
ఏపీలో కరెంటు కోతలపై టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలుగుదేశం అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. విద్యుత్ కోతలు ఎందుకు విధిస్తున్నారో తెలిసి కూడా అనుకూల మీడియాలో అసత్య కథనాలు రాయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. బొగ్గు అందక విద్కుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయిందని తెలిసినా కావాలనే నిందలు వేస్తున్నారన్నారు.
Samayam Telugu Chandrababu-Naidu-770x433


పోలవరం రివర్స్ టెండరింగ్ విధానంతో ప్రజాధనం ఆదా అయిందని విజయసాయి తెలిపారు. అయినా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, రివర్స్ టెండర్ల వల్ల రూ.7,500 కోట్లు నష్టం వస్తుందని కాకి లెక్కలు చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదు లక్షల కోట్ల రూపాయలు దోచుకుతిన్నారని ఆరోపించారు. దాంతోపాటు వరస కరవు వల్ల వ్యవసాయ రంగం లక్ష కోట్ల ఉత్పత్తి కోల్పోయిందన్నారు. వాటి గురించి మాట్లాడితే బాగుంటుందంటూ హితవు పలికారు.

Also Read: బోటు ప్రమాదం: ఆపరేషన్ రాయల్ వశిష్టకు బ్రేక్.. కారణం అదేనా?

వాలంటీర్ల వ్యవస్థపైనా అసత్యాలు ప్రచారం చేశారని విమర్శించారు. వాలంటీర్లకు పెళ్లిల్లే కావని, వారిది మూటలు మోసే పని అని హేళన చేశారన్నారు. రిక్షా తొక్కుతూ బియ్యం సంచులు తీసుకెళ్తారని పచ్చ పార్టీ ఔత్సాహికులు అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. మగవాళ్లు ఇళ్లలో లేని సమయంలో వాలంటీర్లు తలుపులు కొడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు, లోకేష్‌ మహిళల చెప్పు దెబ్బలు తినడం గ్యారంటీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read Also:దసరాకి ట్రైన్ రిజర్వేషన్ దొరకలేదా? అయినా ఏం పర్లేదు!

పార్టీలకు పత్రికలు ఉండడం మామూలు విషయమేనని, అయితే విలువలు పాటించాలని విజయసాయి అన్నారు. తమిళనాడులో డీఎంకే పార్టీ ‘మురసోలి’, శివసేన పార్టీ ‘సామ్నా’ అనే పత్రికలు నడుపుతున్నాయన్నారు. అవి ప్రత్యర్థి పార్టీలను విమర్శలతో చీల్చి చెండాడినా నైతిక విలువలు పాటిస్తాయని, అవాస్తవాలు రాయవని చెప్పుకొచ్చారు. చంద్రబాబు చెప్పినట్లు నడుచుకునే అనుకూల మీడియా మాత్రం విషం కక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.