యాప్నగరం

బీజేపీ అధ్యక్షుడిగా బాబు మనిషి..! విజయసాయి సంచలన వ్యాఖ్యలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేశారు ఎంపీ విజయసాయి రెడ్డి. చంద్రబాబు నిర్మించిన రాజధాని ఎక్కడుందో కనిపించిందా అంటూ సెటైర్లు వేశారు.

Samayam Telugu 26 Dec 2019, 9:37 pm
బీజేపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఆ పార్టీ రాజ్యసభ్య సభ్యుడు సుజనా చౌదరిపై సీబీఐ దర్యాప్తు చేయించాలంటూ ఆధారాలతో ఫిర్యాదు చేసిన విజయసాయి తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేశారు. రాజధాని తరలింపును వ్యతిరేకించిన కన్నా.. రేపు అమరావతిలో మౌన దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఘాటు విమర్శలు చేశారు.
Samayam Telugu VIJAY-SAI-REDDY


ఏపీ రాజధానిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమాయకంగా ప్రశ్నిస్తున్నారంటూ విజయసాయి సునిశిత విమర్శలు చేశారు. చంద్రబాబు నిర్మించిన రాజధాని ఎక్కడుందో కనిపించిందా అంటూ సెటైర్లు వేశారు. లేక బాబు చూపించిన గ్రాఫిక్స్ చూసి మీరూ భ్రమపడ్డారా? అని ఎద్దేవా చేశారు.

Also Read: నాలుక కోస్తా.. ఆడదానివని కూడా చూడను..! లైవ్ డిబేట్‌లో వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా.. తన పదవి కోసం చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. అయితే కన్నా ఎంత సపోర్టుగా మాట్లాడినా ప్రయోజనం లేదని.. పార్టీ అధ్యక్షుడిగా తన మనిషిని నియమించుకోవడానికి చంద్రబాబు పైరవీలు ఆపడని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే విజయసాయి బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. సుజనా అనేక రకాల ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని.. మనీ లాండరింగ్‌.. బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడానికి తప్పుడు మార్గాలు అనుసరించారని ఆధారాలతో సహా లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈడీ, సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. తాజాగా మరో ఏపీ బీజేపీ చీఫ్ కన్నాను టార్గెట్ చేయడం చర్చనీయాంశం.

Read Also: అమరావతికి డబ్బుల్లేవ్.. కుండబద్దలు కొట్టిన వైసీపీ ఎమ్మెల్యే.. ముగిసిన భేటీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.