యాప్నగరం

YES Bank: ‘ఈడీ కేసు పెట్టింది; బాబు పేరు వినిపిస్తోంది’

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యస్ బ్యాంకుపై అంత ప్రేమ కనబర్చారంటేనే అవకతవలకు జరిగినట్టు అర్థం చేసుకోవచ్చని విజయసాయి రెడ్డి విమర్శించారు.

Samayam Telugu 8 Mar 2020, 4:34 pm
దేశంలోని అతిపెద్ద ప్రయివేట్ బ్యాంకుల్లో ఒకటైన ‘యస్‌ బ్యాంక్‌’ కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ కూడా రంగంలోకి దిగి ‘యస్‌’ బ్యాంక్‌ నిర్వహణ బోర్డును రద్దు చేసి కొత్త సీఈవోను నియమించింది. ఖాతాదారులు నెలకు రూ. 50 వేలకు మించి విత్ డ్రా చేసుకోవడంపై ఆంక్షలు విధించింది. యస్ బ్యాంకు వ్యవహారంలో ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా.. యస్ బ్యాంకు వ్యవహారంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి విజయసాయి రెడ్డి లంకె పెట్టారు.
Samayam Telugu babu


‘‘Yes Bank పైన చంద్రబాబు అంత ప్రేమ కనబర్చారంటేనే అవతవకలు జరిగినట్టు ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ పై ఈడి కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ పై దర్యాప్తు జరుగుతోంది. దేశంలో ఎక్కడ హవాలా, లాండరింగ్ బయటపడ్డా బాబు పేరు వినిపిస్తోంది’’ అని వైఎస్సార్సీపీ ఎంపీ ట్వీట్ చేశారు.

అంతకు ముందు మరో ట్వీట్ చేసిన విజయసాయి రెడ్డి.. చంద్రబాబు యస్ బ్యాంకును అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. రూ.1300 కోట్ల టీటీడీ నిధులను డిపాజిట్ చేయించిన బాబు కమీషన్లు తీసుకున్నారని విజయసాయి ఆరోపణలు గుప్పించారు. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పిందన్నారు. యస్ బ్యాంకుకు ఏపీ టూరిజం నిధులను చంద్రబాబు దోచిపెట్టారని విమర్శించిన విజయసాయి రెడ్డి.. ఇలాంటివి ఇంకెన్ని ఉన్నాయో అని అనుమానం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.