యాప్నగరం

Chandrababu Naidu కోడెల ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారు: విజయసాయి

చంద్రబాబు నాయుడు రాజకీయాల కారణంగా కోడెలకు ఆత్మశాంతి లేకుండా పోతోందని విజయసాయి రెడ్డి ఆరోపించారు. నమ్మిన వారు ఆపదలో అండగా నిలవకపోవడంతోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తెలిపారు.

Samayam Telugu 18 Sep 2019, 1:07 pm
కోడెల మరణం ఏపీలో రాజకీయ దుమారానికి కారణమైంది. ఆయనపై ప్రభుత్వం తప్పుడు కేసులు మోపిందని, రాజకీయంగా వేధించిందని టీడీపీ ఆరోపిస్తోంది. జగన్ సర్కారు వేధింపుల వల్ల తన తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డారని కోడెల కుమార్తె హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించగా.. కోడెల కుటుంబీకులు తిరస్కరించారు. ఆయన్ను హత్య చేసిన వారే.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామనడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Samayam Telugu kodela2


వైఎస్ఆర్సీపీ నేతల వాదన మాత్రం మరోలా ఉంది. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కారణంగానే కోడెల బలైపోయాడని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. స్పీకర్‌గా ఉన్న సమయంలో కోడెల తప్పులు చేయడానికి బాబు కారణం అయ్యారంటున్నారు. తమ ప్రభుత్వం వేధిస్తే.. ఈ మూడు నెలల్లో ఒక్కరోజైనా ఆయనకు మద్దతు చందబ్రాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నారు. కొడాలి నాని అయితే ఓ అడుగు ముందుకేసి.. కోడెల హత్య కేసులో చంద్రబాబును ఏ1 నిందితుడిగా అభివర్ణించారు.

విజయసాయిరెడ్డి చేసిన దుష్ప్రచారం కూడా కోడెల ఆత్మహత్యకు కారణమైందని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా.. ఈ విషయమై వైఎస్ఆర్సీపీ ఎంపీ స్పందించారు. చంద్రబాబు నాయుడు కోడెల మరణాన్ని రాజకీయం చేస్తున్నారని.. ఆయన ఆత్మకు శాంతి లేకుండా వేధిస్తున్నారని ఆరోపించారు.

గతంలో తను కొనుగోలు చేసిన 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మేల్యేలను అనర్హులు చేయకుండా స్పీకర్‌గా ఉన్న కోడెలను వాడుకుని బాబు వదిలేశాడని విజయసాయి విమర్శించారు. నమ్మిన వారు ఆపదలో తనకు అండగా నిలవలేదన్న నిస్పృహతోనే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని విజయసాయి రెడ్డి ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.