నగరి ఎమ్మెల్యే రోజా డ్రైవర్ అవతారం ఎత్తారు. ఏకంగా 108 డ్రైవింగ్ సీట్లో కూర్చుని వాహనాన్ని నడిపారు.నగరిలో కొత్తగా వచ్చిన 108,104 వాహనాలను ప్రారంభించారు.. ఈ కార్యక్రమానికి రోజా హాజరయ్యారు. జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. తర్వాతే ఆమె డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు. సరాదాగా కొద్దిసేపు డ్రైవింగ్ చేసి స్థానికుల్ని ఉత్సాహపరిచారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్తగా 108, 104 వాహనాలను కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని రోజా అన్నారు.
కొత్తగా 108, 104 అంబులెన్సులు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడ నుంచి అంబులెన్సులు రాష్ట్ర నలుమూలలకు తరలి వెళ్లాయి. ఈ వాహనాల్లో 676 వాహనాలు 104 కాగా.. మరో 412 వాహనాలు 108లు. ప్రభుత్వం కొత్తగా అత్యాధునిక వైద్య సేవలందించే ఈ అంబులెన్సులలో 282 బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్ఎస్)కు సంబంధించినవి.. 104 అడ్వాన్స్ లైఫ్ సపోర్టు (ఏఎల్ఎస్)తో తీర్చిదిద్దారు. మరో 26 అంబులెన్సులను చిన్నారులకు (నియో నేటల్) వైద్య సేవలందించేలా తయారు చేశారు.
ఇక 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేసిన ప్రభుత్వం, హెల్త్ కేర్ డెలివరీకి అవకాశం ఉంటుంది. ఆ స్థాయిలో మొబైల్ మెడికల్ యూనిట్ల(ఎంఎంయూ)ను తీర్చిదిద్దారు. మారుమూల ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలందించే విధంగా, అన్ని వసతులతో ఎంఎంయూలను సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక సర్వీసు అందుబాటులో ఉండే విధంగా ఒకేసారి వాహనాలను సిద్ధం చేశారు.
కొత్తగా 108, 104 అంబులెన్సులు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడ నుంచి అంబులెన్సులు రాష్ట్ర నలుమూలలకు తరలి వెళ్లాయి. ఈ వాహనాల్లో 676 వాహనాలు 104 కాగా.. మరో 412 వాహనాలు 108లు. ప్రభుత్వం కొత్తగా అత్యాధునిక వైద్య సేవలందించే ఈ అంబులెన్సులలో 282 బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్ఎస్)కు సంబంధించినవి.. 104 అడ్వాన్స్ లైఫ్ సపోర్టు (ఏఎల్ఎస్)తో తీర్చిదిద్దారు. మరో 26 అంబులెన్సులను చిన్నారులకు (నియో నేటల్) వైద్య సేవలందించేలా తయారు చేశారు.
ఇక 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేసిన ప్రభుత్వం, హెల్త్ కేర్ డెలివరీకి అవకాశం ఉంటుంది. ఆ స్థాయిలో మొబైల్ మెడికల్ యూనిట్ల(ఎంఎంయూ)ను తీర్చిదిద్దారు. మారుమూల ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలందించే విధంగా, అన్ని వసతులతో ఎంఎంయూలను సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక సర్వీసు అందుబాటులో ఉండే విధంగా ఒకేసారి వాహనాలను సిద్ధం చేశారు.