యాప్నగరం

వైసీపీలో ఎమ్మెల్సీ పదవుల సందడి.. వారిద్దర్ని కొనసాగింపు, ఆయనకు మాత్రం బంపరాఫర్?

Ysrcp Mlc పోస్టుల సందడి కనిపిస్తోంది. త్వరలో ఖాళీకానున్న ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈసారి ఎవరికి అవకాశం దక్కుతుంది.. ఎవర్ని కొనసాగిస్తారు.. సామాజిక సమీకరణాలతో అధినేత వైఎస్ జగన్ ఉన్నారా.. జిల్లాల వారీగా లెక్కలు ఎలా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఈసారి భారీగా పదవుల భర్తీ ఉండటంతో ఛాన్స్ కోసం అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ పదవులపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 18 Jan 2023, 5:19 am

ప్రధానాంశాలు:

  • వైసీపీలో పదవుల సందడి
  • ఖాళీ కాబోతోన్న ఎమ్మెల్సీలు
  • ఈసారి ఎవరికి ఛాన్స్ ఇస్తారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ysrcp Mlcs
ఏపీలో ఎమ్మెల్సీ పదవుల సందడి కనిపిస్తోంది. మార్చి నుంచి మే వరకూ చాలా స్థానాలు ఖాళీ ఏర్పడనుండటంతో వైఎస్సార్‌సీపీ అన్ని ఎమ్మెల్సీలను దక్కించుకోవాలని భావిస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో వైఎస్సార్‌సీకి చెందిన ఐదుగురు, టీడీపీకి చెందిన ఇద్దరి పదవీ కాలం ముగుస్తోంది. అలాగే స్థానిక సంస్థల కోటాలో తొమ్మిది స్థానాలు కూడా టీడీపీవే. ఈ మొత్తం ఎమ్మెల్సీలను కైవసం చేసుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది.
సామాజిక సమీకరణాలతో పాటూ జిల్లాలవారీగా ప్రాధాన్యతా క్రమంలో ఎమ్మెల్సీ పదవుల్ని కట్టబెట్టాలని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. ఈ స్థానాల్లో ఎస్టీతో పాటూ బీసీలు, నియోజకవర్గాల వారీగా ప్రభావం చూపించే కొందరు నేతలకు అవకాశం ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఖాళీ అయ్యే స్థానాలకు సంబంధించి వైఎస్సార్‌సీపీలో ఆశావహుల సంఖ్య భారీగానే కనిపిస్తోంది.

మండపేటలో తోట త్రిమూర్తులును అభ్యర్థిగా ఖరారు చేయడంతో పట్టాభిరామయ్య చౌదరిని.. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్‌కు టికెట్‌ ఖరారు ఖాయం కావడంతో బొప్పన భవకుమార్‌ను అధినేత వైఎస్ జగన్ పిలిచి మాట్లాడారు. ఇద్దరికి ఏదో ఒకటి చేద్దాం అని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా ఉన్న రావి రామనాథం బాబును తొలగించారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే రామనాథం బాబు సీఎంను కలిసినప్పుడు ఆయనకూ భరోసా ఇచ్చారని చెబుతున్నారు. అలాగే మర్రి రాజశేఖర్‌, జంకె వెంకటరెడ్డి, మేకా శేషుబాబు, నర్తు రామారావు వంటి ఆశావహుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.

వైఎస్సార్‌సీపీకి ఎమ్మెల్యేల కోటాలో పోతుల సునీత, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, దివంగత చల్లా భగీరథరెడ్డి, గంగుల ప్రభాకర్‌రెడ్డి, సూర్యనారాయణ రాజుల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. అయితే వీరిలో డొక్కా, పోతుల సునీతలను మళ్లీ కొనసాగించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో చల్లా భగీరథరెడ్డి ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. మరి మరోసారి ఆ కుటుంబసభ్యులకు అవకాశమిస్తారా అన్నది చూడాలి. భగీరథరెడ్డి భార్య చల్లా శ్రీలక్ష్మి ఇటీవలే సీఎం జగన్‌ను కలిశారు. ఒకవేళ అదే జరిగితే గంగుల ప్రభాకర్‌రెడ్డి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది.

నారా లోకేష్, బచ్చుల అర్జునుడు ఎమ్మెల్సీ పదవీ కాలం మార్చి 29నే ముగియనుంది. అర్జునుడు కృష్ణా జిల్లాకు చెందిన నేత.. మరి ఆ స్థానాన్ని గన్నవరంలో లెక్కల ప్రకారం.. యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావుల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే విజయనగరం జిల్లాకు చెందిన సూర్యనారాయణ రాజును కొనసాగింపు కష్టమనే చెబుతున్నారు. ఆయన బదులు అదే జిల్లా నుంచి ఆయన సామాజిక వర్గానికే చెందిన రఘురాజు ఎమ్మెల్సీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే మరికొందరు కూడా ఆశావహులు ఉన్నారు.. వారు కూడా తమవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.