యాప్నగరం

ఏపీలో పదో తరగతి కూడా పాస్ కాని వాళ్లు కూడా ప్రభుత్వ సలహాదారులే: ఎంపీ రఘురామ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మంత్రులకు సలహాదారులను ఇవ్వడం చెల్లదన్నారు. వీరందరినీ పదవుల నుంచి తొలగించాలన్నారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 22 Mar 2023, 11:36 pm
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి కూడా పాస్ కాని వారు కూడా ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మంత్రులకు సలహాదారులను ఇవ్వడం చెల్లదని.. అందరినీ తీసేయాలని డిమాండ్ చేశారు. దేశంలోనే మంత్రులకు సలహాదారులు లేరని.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఎందుకని ప్రశ్నించారు. ఏపీలో ఏంటీ ఈ సలహాదారులని చీఫ్ జస్టిస్ అడిగారని పేర్కొన్నారు.
Samayam Telugu ఎంపీ రఘురామ కృష్ణరాజు (ఫైల్ ఫొటో)


రాజ్యాంగంలో ఓనమాలు కూడా తెలియని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సలహాదారులను అవినీతి శాఖ పరిధిలోకి తెస్తామంటున్నారని ఎంపీ రఘురామ మండిపడ్డారు. వీలైతే ముఖ్యమంత్రి జగన్ తనను రాజ్యాంగ సలహాదారుడిగా పెట్టుకోవచ్చని వ్యాఖ్యానించారు. మంత్రులకు సెక్రటరీగా ఐఏఎస్లు ఉంటారని, సలహాదారుల పోస్ట్కు ప్రకటన చేయాలని, ఇంటర్వ్యూలు ఉంటాయని రఘురామ అన్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో బూత్ క్యాప్చరింగ్ లాగా పెట్టుబడుల పేరుతో స్థల క్యాప్చరింగ్ చేస్తున్నారని ఎంపీ రఘురామ ఆరోపించారు. అభివృద్ధి కోసం రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు రావాలంటే మళ్లీ తానే ఎన్నికల్లో గెలవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చేలోపు కొన్నిటికైనా స్థలాలు ఇస్తారని.. స్థలయజ్ఞం అయితే కచ్చితంగా జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సీఎం జగన్‌కు ఓపెన్‌ ఛాలెంజ్ చేస్తున్నానని తెలిపారు. పెట్టుబడిదారులకు స్థలం ఎక్కడ సృష్టించి ఇవ్వగలరని, తమ దగ్గర ఉన్నది 45 వేల ఎకరాలైతే.. 7 లక్షల ఎకరాలు ఎలా సృష్టించి ఇస్తారని ఎంపీ రఘురామ ప్రశ్నించారు. తమ దగ్గర ఉన్న 45 వేల ఎకరాల భూమిని లక్షల మెగావాట్లకు ఎలా సర్దుతారని ప్రశ్నించారు. ఒకవేళ స్థలం సేకరించాలంటే.. ఎవరి స్థలాలు తీసుకొని, ఎవరికి ఇస్తారని ఎంపీ ప్రశ్నించారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.