యాప్నగరం

సీఎం జగన్‌ బెయిల్ తక్షణమే రద్దు చేయండి.. సీబీఐ కోర్టులో సంచలన పిటిషన్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెంటనే బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు.

Samayam Telugu 6 Apr 2021, 2:52 pm
వైఎస్సార్ కంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరో సంచలనానికి తెరలేపారు. ఈ సారి ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ నిర్దోషిగా బయటపడాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు ట్విస్ట్ ఇచ్చారు.
Samayam Telugu సీఎం జగన్‌తో ఎంపీ రఘురామ


ఈ మేరకు మంగళవారం సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ వేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నమోదైన అవినీతి కేసుల్లో విచారణ ఆలస్యంగా జరుగుతోందని రఘురామ పేర్కొన్నారు. కాబట్టి వెంటనే ఆయన బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన 11 చార్జిషీట్లలో సీఎం జగన్ ఏ1 నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రక్షించుకునేందుకే సీబీఐ కోర్టులో పిటిషన్ వేసినట్లు వ్యాఖ్యానించారు. .

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్దోషిలా బయటపడాలన్నదే తన ఉద్దేశమని ఎంపీ రఘురామ పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రక్షించుకునే బాధ్యత ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా తనపై ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో త్వరలో తిరుపతి ఎన్నిక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ తీవ్ర చర్చనీయాంశమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.