యాప్నగరం

సీఎం పదవికి జగన్ రాజీనామా చాన్స్: ఇద్దరు సీఎంలు ఇలాగే.. ఎంపీ రఘురామ సంచలనం

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీఎం జగన్ పదవిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 13 Nov 2020, 4:00 pm
కోర్టు ధిక్కరణ కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాల్సి రావొచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ మాజీ సీఎంలు నీలం సంజీవరెడ్డి, ఎన్ జనార్ధన్‌రెడ్డి సైతం పదవులకు రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. రేపోమాపో కోర్టు ధిక్కరణ నోటీసులు తీసుకోవడానికి జగన్‌ సిద్ధంగా ఉండాలన్నారు. ఎంపీ రఘురామ శుక్రవారం తన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.
Samayam Telugu సీఎం జగన్, ఎంపీ రఘురామ


ఈ సందర్భంగా ఎంపీ రఘురామ మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు కోర్టు నోటీసులపై తమ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. తప్పు ఒప్పుకుని కోర్టులను క్షమాపణ కోరితే సీఎం జగన్‌కు శిక్ష తప్పొచ్చన్నారు. ఎవరైనా కింది కోర్టు ఇచ్చిన తీర్పులపై పైకోర్టుకు వెళ్లడం సహజమని.. కానీ, వైసీపీ పెద్దలు మాత్రం జడ్జిల చిత్తశుద్ధి మీదే అనుమానాలు ఉన్నాయంటూ పెద్ద వివాదానికి తెరలేపారని ఎంపీ రఘురామ పేర్కొన్నారు. నిజంగా న్యాయ వ్యవస్థపై, సుప్రీం కోర్టుపై గౌరవం ఉంటే తమ ఫిర్యాదుపై చీఫ్‌ జస్టిస్‌ స్పందన కోసం వేచి చూసేవారే గాని.. ఫిర్యాదు పత్రాలు బహిర్గతం చేసే వారు కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారని రఘురామ అన్నారు. మీడియా ముందు రచ్చ చేయడంతో వైసీపీ పెద్దల దురుద్దేశాలు బయటపడిపోయాయని వ్యాఖ్యానించారు.

అలాగే రాష్ట్రంలో ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా.. సీఎం జగన్‌కు దుబ్బాక ఫలితం తప్పదని జోస్యం చెప్పారు. ఏపీలో ఎన్నిక జరిగితే ఆయన పార్టీ ఓడిపోకతప్పదని వ్యాఖ్యానించారు. అలాగే ఏపీకి అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.