యాప్నగరం

ఏపీ మహిళలూ సీరియల్స్ చూడటం తగ్గించండి, ఫోకస్ ఇటు మార్చండి: ఎంపీ రఘురామ

YSRCP: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీరియల్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 12 Oct 2020, 4:33 pm
వైసీపీ ప్రభుత్వంపై విమర్శలతో నిత్యం వార్తల్లో ఉండే అదే పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి ఉద్యమంలో మహిళలు కీలక పాత్ర పోషించాలని, అందుకు గానూ సీరియల్స్ చూడటం తగ్గించండి అంటూ సూచన చేశారు. ఎంపీ రఘురామ ప్రతి రోజూ నిర్వహించే ‘రచ్చబండ’లో భాగంగా సోమవారం మీడియాతో ఆసక్తికర విషయలు పంచుకున్నారు.
Samayam Telugu రఘురామ కృష్ణంరాజు


ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగుతుందని ఎంపీ రఘురామ అన్నారు. రాజధాని అమరావతిని రిఫరెండం‌గా భావిస్తే ఎన్నికలకు తాను సిద్ధమని పునరుద్ఘాటించారు. తన సవాల్‌కు స్పందించకుండా వైసీపీ నేతలు తోక ముడిచారని ఎద్దేవా చేశారు. అమరావతి కొనసాగింపు ఉద్యమం 300 రోజులుగా కొనసాగుతున్న నేపథ్యంలో సినిమా ఫంక్షన్ల మాదిరిగా స్వర్ణోత్సవాలు లాంటివి కాకుండా.. ఇదే స్ఫూర్తితో ఉద్యమాన్ని రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్రవ్యాప్త ఆందోళనగా చేపట్టాలని పిలుపునిచ్చారు. దీన్ని అమరావతి రైతుల సమస్యగా కాక, ప్రజలందరి సమస్యగా, రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకెళ్లాలన్నారు.

సోషల్ మీడియాలో కేసులు పెట్టి భయపడకుండా ఇంకా బలంగా ముందుకెళ్లాలని ఎంపీ రఘురామ అన్నారు. అమరావతిలో ఉన్న మహిళామణుల యుద్ధ స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మహిళలు ముందుంటే దేనికైనా శుభం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు గాను, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కాస్త సీరియల్స్ చూడంటం తగ్గించాలని సూచించారు. ఇకపై ఏపీ మహిళలంతా అమరావతిపై ఫోకస్ పెట్టాలన్నారు. అమరావతి సాధించే వరకు కనీసం 50 శాతం సీరియల్ టైం అయినా తగ్గించుకోవాలని మహిళలను కోరుతున్నట్లు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.