యాప్నగరం

YS Jagan పై ప్రధాని మోదీకి ఫిర్యాదు, ఎవరి మాటా వినట్లేదంటూ.. వైసీపీ రెబల్ ఎంపీ లేఖ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. ఏపీలో ఆర్థిక పరిస్థితిపై ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు.

Samayam Telugu 28 Mar 2022, 6:46 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ రాశారు. ఒక పని కోసం తీసుకొచ్చిన అప్పులు ఇతర పనులకు వాడటం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు.
Samayam Telugu ప్రధాని మోదీతో సీఎం జగన్ (ఫైల్ ఫొటో)



ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితిపై కాగ్‌ లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని.. ఎస్‌ఎఫ్‌ఐవో లేదా సీబీఐ ఆర్థిక నేర విభాగంతో విచారణ జరిపించాలని ప్రధాని మోదీని ఎంపీ రఘురామ కోరారు. బ్యాంకులు, కార్పొరేషన్ల నుంచి రూ. వేల కోట్లు ఎలా సేకరించారో విచారణ జరిపించాలని కోరారు. అప్పులు తీసుకునేటప్పుడు ఏపీ సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని లేఖలో ప్రస్తావించారు.

ఈ వ్యవహారంలో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కూడా చేయించాలని విజ్ఞప్తి చేశారు. విచారణ వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికారులను ప్రశ్నించాలనే నిబంధన సైతం విధించాలని రఘురామ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్.. సీతయ్యలాగా వ్యవహరిస్తున్నారని, ఆయన ఎవరి మాట వినరని విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.