యాప్నగరం

విజయసాయిరెడ్డికి బిగ్ షాక్.. బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టులో..!

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఊహించని షాక్ ఇచ్చారు. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ..!

Samayam Telugu 3 Aug 2021, 6:59 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో సంచలన పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ పార్లమెంటరీ నేతగా కేంద్ర హోం, ఆర్థిక శాఖ కార్యాలయాల్లో అధికారులను తరచుగా కలిసే విజయసాయిరెడ్డి.. తనకు కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలున్నాయనే విధంగా చిత్రీకరించి సాక్షుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా భయం కలిగిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Samayam Telugu విజయసాయిరెడ్డి


విజయసాయిరెడ్డి ఎంపీ కాగానే .. సీఎం జగన్‌ ఆస్తుల కేసుల ప్రధాన దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన అధికారిని సీబీఐ జేడీ చేయవద్దని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారని, ఇది స్వేచ్ఛాయుత విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఆరోపించారు.

విజయనగరం మాన్సాస్‌ ట్రస్ట్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నాలుగు జీవోలు చట్టవిరుద్ధమని హైకోర్టు కొట్టివేసిన సందర్భంలో అశోక్‌గజపతిరాజు దొడ్డిదారిన కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించడం దారుణమని ఎంపీ రఘురామ అన్నారు. అశోక్ గజపతిరాజును జైలుకు పంపుతామని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం కోర్టు ధిక్కరణే కాకుండా, న్యాయవ్యవస్థ పట్ల ఆయన దృక్పథాన్ని తేటతెల్లం చేస్తోందని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.