నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైఎస్సార్సీపీ అధిష్టానం షాకిచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.. వారంలోగా సమాధానం ఇవ్వాలని కోరింది. వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈ నోటీసులు పంపారు. ఇటీవల ఎంపీ ప్రభుత్వంతో పాటూ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశం కాగా.. ఆయన కేంద్రానికి లేఖ రాయడం అధిష్టానానికి ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యల్ని అధినేత జగన్ కూడా సీరియస్గా తీసుకున్నారు.. అందుకే షోకాజ్ నోటీసులు పంపారని తెలుస్తోంది. ఈ నోటీస్పై రఘురామకృష్ణంరాజు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: హైదరాబాద్: భూవివాదంలో వైసీపీ నేత.. పోలీస్ స్టేషన్కు వెళ్లిన పీవీపీ
గతవారం ఎంపీ రఘురామకృష్ణంరాజు వైఎస్సార్సీపీ నర్సాపురం లోక్సభ పరిధిలో ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది. రాజీనామాలు చేసి మళ్లీ పోటీ చేయాలనే వరకు సవాళ్లు విసురుకున్నారు. ఆ తర్వాత ఎంపీ రఘురామ దిష్టి బొమ్మల్ని దగ్థం చేయడం పార్టీలో చర్చనీయాంశంమైంది. ఈ పరిణామాల మధ్య ఆయన లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు.. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు.. తన నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన సమయంలో రక్షణ కావాలని కోరారు.
Read Also: హైదరాబాద్: భూవివాదంలో వైసీపీ నేత.. పోలీస్ స్టేషన్కు వెళ్లిన పీవీపీ
గతవారం ఎంపీ రఘురామకృష్ణంరాజు వైఎస్సార్సీపీ నర్సాపురం లోక్సభ పరిధిలో ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది. రాజీనామాలు చేసి మళ్లీ పోటీ చేయాలనే వరకు సవాళ్లు విసురుకున్నారు. ఆ తర్వాత ఎంపీ రఘురామ దిష్టి బొమ్మల్ని దగ్థం చేయడం పార్టీలో చర్చనీయాంశంమైంది. ఈ పరిణామాల మధ్య ఆయన లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు.. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు.. తన నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన సమయంలో రక్షణ కావాలని కోరారు.