యాప్నగరం

శ్రీకాకుళం: పుట్టగొడుగుల కోసం ఘర్షణ.. వైసీపీ కార్యకర్త హత్య

పుట్టగొడుగుల కోసం ఇరు వర్గాల మధ్య గొడవ.. కర్రలు, బల్లెంతో దాడులు. బల్లెంతో జంగం అనే వ్యక్తిపై దాడి.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి. గ్రామంలో 144 సెక్షన్ అమలు.

Samayam Telugu 15 Oct 2019, 10:20 pm
శ్రీకాకుళం జిల్లా దారుణం జరిగింది. కొత్తూరు మండలం కుంటిభద్ర గ్రామంలో పుట్టగొడుగులు విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో రెచ్చిపోయిన ఇరు వర్గాలు బల్లెం, కర్రలతో ఒకరిపై మరొకరు దాడులకు తెగబడ్డారు. ఈ ఘర్షణలో కొవ్వాడ యర్రయ్య అనే వ్యక్తి బల్లెంతో కామక జంగం, హిమగిరిపై చేశాడు. ఈ దాడిలో జంగంకు తీవ్ర గాయాలుకాగా.. పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని వెంటనే కొత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu sklm.


ఇదిలా ఉంటే పుట్టగొడుగుల గొడవ కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. జంగం వైసీపీ కార్యకర్తని.. టీడీపీ వర్గీయులు దాడి చేసి హత్య చేసినట్లు గ్రామంలో అలజడి రేగింది. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తగా భారీగా పోలీసుల్ని మోహరించారు.. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు ఈ ఘర్షణలో చనిపోయిన జంగం కొద్ది రోజుల క్రితం టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి పొరుగింట్లో ఉండే టీడీపీ కార్యకర్త కొవ్వాడ యర్రయ్యతో చిన్న, చిన్నగొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈలోపే పుట్టగొడుగుల వివాదంతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.