యాప్నగరం

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. జూల్లోకి సందర్శకులకు అనుమతి

నిబంధలనల మేరకు అటవీశాఖకు సంబంధించిన అన్ని పార్కులు, నగరవనాలు, ఎకో టూరిజం కేంద్రాల్లోకి సందర్శకులను అనుమతించాలని రాష్ట్రంలోని సర్కిల్‌ కేంద్రాల అధిపతులు, డిఎఫ్‌వోలను ఆదేశించారు.

Samayam Telugu 19 Nov 2020, 7:51 am
ఏపీలో కరోనాతో మూతపడిన జూలు, నగర వనాలు, ఎకో టూరిజం పార్కులను ప్రభుత్వం తెరిచింది. ఈ మేరకు బుధవారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్‌ పార్క్, విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్క్, కంబాలకొండలోని ఎకో టూరిజం పార్క్, రాష్ట్రంలోని నగరవనాలు, కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం కేంద్రాల్లోకి సందర్శకులను అనుమతించాలని ఆదేశించారు.
Samayam Telugu జూలకు అనుమతి


కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనుమతించిన నిబంధలనల మేరకు అటవీశాఖకు సంబంధించిన అన్ని పార్కులు, నగరవనాలు, ఎకో టూరిజం కేంద్రాల్లోకి సందర్శకులను అనుమతించాలని రాష్ట్రంలోని సర్కిల్‌ కేంద్రాల అధిపతులు, డిఎఫ్‌వోలను ఆదేశించారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో మూసివేసిన ఈ కేంద్రాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ, సెంట్రల్‌ జూ అథారిటీ ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మాస్క్, సామాజిక దూరం వంటి జాగ్రత్తలు పాటించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.