యాప్నగరం

Prakasam: వేటపాలెంలో కామాంధులు.. మతిస్థిమితం లేని బాలికను లాక్కెళ్లి.!

మద్యం మత్తులో మతిస్థిమితం లేని బాలికను తీసుకెళ్లి అమానుష చర్యకు పాల్పడ్డారు దుర్మార్గులు. బాలికపై సామూహిక అత్యాచారానిని తెగబడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపుతోంది.

Samayam Telugu 17 Jun 2021, 8:09 pm
ప్రకాశం జిల్లాలో కామాంధులు రెచ్చిపోయారు. మతిస్థిమితం లేని బాలిక(15)పై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. కామంతో కళ్లు మూసుకుపోయిన కీచకులు కనీస కనికరం లేకుండా అభాగ్యురాలిపై నీచానికి ఒడిగట్టారు. మద్యం మత్తులో బాలికను లాక్కెళ్లి అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. వేటపాలెం గ్రామానికి చెందిన నాగరాజు, లక్ష్మయ్య మద్యం మత్తులో మతిస్థిమితం లేని బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. బాలికను నలుగురు కలిసి బలవంతంగా తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. అత్యాచారానికి పాల్పడిన నాగరాజు, లక్ష్మయ్య సహా వారికి సహకరించిన మరో ఇద్దరు జాలిరెడ్డి, అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. చీరాల డీఎస్పీ శ్రీకాంత్ కేసును పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
woman


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.