యాప్నగరం

ప్రకాశం: కరోనా ఉధృతి.. ఈ మండలాల్లో రెడ్‌జోన్, కఠిన నిబంధనలు అమలు

ప్రకాశం జిల్లాలో కరోనా నియంత్రణకు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ వచ్చిన 16 మండలాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు. ఈ మండలాల్లో ప్రజలు..

Samayam Telugu 20 Jan 2022, 11:50 am
ఏపీలో రోజురోజుకు కరోనా ఉధృతి తీవ్రంగా పెరుగుతోంది. బుధవారం ఏకంగా 10,057 కేసుల నమోదయ్యాయి. మంగళవారం 7 వేలకు చేరువైన కేసులు.. బుధవారం ఒక్కరోజులోనే 3 వేలకు పైగా పెరగడంతో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కరోనా కట్టడికి ఆంక్షలు అమలు చేస్తోంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ప్రకాశం జిల్లాలో కరోనా నియంత్రణకు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ వచ్చిన 16 మండలాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు. ఒంగోలు, కందుకూరు, మద్దిపాడు, మార్టూరు, అద్దంకి, కొత్తపట్నం, పర్చూరు, మార్కాపురం, కంభం, కొరిసపాడు, టంగుటూరు మండలాలను రెడ్‌ జోన్‌గా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ మండలాలలో కోవిడ్ నిబంధనలను కఠినతరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని కోరారు.

మరోవైపు ప్రకాశం జిల్లాలో బుధవారం 716 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,41,022కి చేరింది. ప్రస్తుతం జిల్లాలో 2074 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాలో మరణాల సంఖ్య 1131గా ఉంది. మొత్తం 1,37,817 మంది కరోనాను జయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.