యాప్నగరం

ప్రకాశం: చెక్ డ్యామ్‌ను జిలేటిన్ స్టిక్స్‌తో పేల్చేసిన రైతు.. కారణం ఏంటంటే!

Prakasam District Check Dam Blast కలకలంరేపింది. దోర్నాల దగ్గర నల్లవాగుపై చెక్‌డ్యామ్ నిర్మించారు. ఇంతలో ఓ రైతు చెక్‌డ్యామ్‌ను జిలేటిన్ స్టిక్స్‌తో పేల్చేశాడు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 29 Nov 2022, 11:51 am

ప్రధానాంశాలు:

  • ప్రకాశం జిల్లా దోర్నాల దగ్గర ఘటన
  • చెక్‌డ్యామ్‌ను పేల్చేసిన స్థానిక రైతు
  • పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Prakasam District Check Dam Blast
ప్రకాశం జిల్లాలో చెక్‌డ్యామ్‌ పేల్చి వేయడం కలకలంరేపింది. దోర్నాల నల్లవాగుపై నిర్మించిన చెక్ డ్యామ్‌ను జిలేటిన్ స్టిక్స్‌తో ఓ రైతు పేల్చేశాడు. దోర్నాల సమీపంలో ప్రభత్వ భూమిలోని నల్లవాగుపై రూ,9 లక్షల 50 వేలతో నిర్మించిన చెక్ డ్యాం నిర్మించారు. మల్లికార్జున్ అనే రైతు జిలెటిన్ స్టిక్స్‌ తీసుకొచ్చి పేల్చడంతో ధ్వంసమైంది. సమాచారం అందుకున్న ఇరిగేషన్ అధికారులు.. ధ్వంసమైన చెక్ డ్యాంను పరిశీలించారు. మల్లికార్జునపై పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు.. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అయితే రైతు వాదన మరోలా ఉంది.. అధికారులు చెక్‌డ్యాంను తన పొలంలో నిర్మించారని ఆరోపిస్తున్నాడు. రైతు ఆరోపణలపై అధికారులు స్పందించాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. పోలీసులు మల్లికార్జున కోసం గాలిస్తున్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.