యాప్నగరం

Janasene Party లోకి మాజీ ఎమ్మెల్యే ఆమంచి సోదరుడు?.. చీరాలలో ఆసక్తికర రాజకీయం!

Amanchi Srinivasa Rao సోదరుడి ఫోటో జనసేన పార్టీ ఫ్లెక్సీలో ప్రత్యక్షమైంది. జనసేన సభ్యత్వాలపై స్థానికంగా ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా.. అందులో స్వాములు ఫోటోను కూడా ముద్రించడం స్థానికంగా రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఆయన చూపు జనసేన వైపు ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో కూడా జోరుగా చర్చ మొదలైంది. స్వాములు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 11 Feb 2023, 5:52 am

ప్రధానాంశాలు:

  • చీరాలలో ఆసక్తికరంగా మారిన రాజకీయాలు
  • జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే సోదరుడు?
  • రాజకీయ వర్గాల్లో జోరుగా మొదలైన చర్చ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Amanchi Krishna Mohan Brother Janasena Party
బాపట్ల జిల్లా చీరాల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ (Amanchi Krishna Mohan ) సోదరుడి ఫోటో జనసేన పార్టీ (Janasena Party) ఫ్లెక్సీలో ఉండటం చర్చనీయాంశమైంది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జనసైనికులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే ఇందులో జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్.. ఆమంచి శ్రీనివాసరావు (స్వాములు) (Amanchi Swamulu) ఫోటోలు ఉన్నాయి.
ఆమంచి శ్రీనివాసరావు (స్వాములు) చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు. అంతేకాదు పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా కృష్ణమోహన్‌ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ ఫ్లెక్సీలో స్వాములు ఫొటో ఉండటం ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే సోదరుడు జనసేనకు దగ్గరవుతున్నారనే చర్చ మొదలైంది. స్థానికంగా కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది.
ఆమంచి కృష్ణ మోహన్ 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాత్రం నవోదయం పార్టీ నుంచి పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత టీడీపీకి దగ్గరయ్యారు.. చంద్రబాబు సమక్షంలో పార్టీలోకి వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైఎస్సార్‌సీపీలో చేరారు. చీరాల నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన కరణం బలరాం చేతిలో ఓడిపోయారు.

బలరాం గెలుపు తర్వాత చీరాల రాజకీయం అనూహ్యంగా మారింది. ఎమ్మెల్యే కరణం అనూహ్యంగా వైఎస్సార్‌సీపీకి దగ్గరయ్యారు. దీంతో ఆమంచికి చీరాలలో ప్రాధాన్యం తగ్గింది.. బలరాం వర్గంతో కూడా విభేదాలు ఉన్నాయి. దీంతో ఆమంచి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్నారు. అయితే అధిష్టానం చీరాలపై ఫోకస్ పెట్టింది.. నియోజకవర్గాన్ని కరణం ఫ్యామిలీకి అప్పగించింది. ఆమంచిని పర్చూరు పంపించి.. అక్కడి బాధ్యతల్ని అప్పగించింది. అయితే ఇప్పుడు కృష్ణమోహన్‌ సోదరుడి ఫోటో జనసేన పార్టీ ఫ్లెక్సీలో ఉండటం ఆసక్తికరంగా మారింది.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.