ఏపీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి పథకాలపై ఆరా తీస్తున్నారు.. స్థానికంగా ఉన్న సమస్యల్ని తెలుసుకునే పర్యత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులకు స్థానికుల నుంచి వ్యతిరేకత తప్పడం లేదు. అక్కడక్కడా స్థానికులు నేతల్ని నిలదీస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అలాంటి పరిస్థితే ఎదురైంది. మహిళపై కోపంతో ఊగిపోయిన ఆయన.. బూతు పురాణం అందుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరులోబుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి బాలినేనిని గ్రామంలో ధాన్యం కొనుగోళ్ల అక్రమాలపై టీడీపీ నేతలు కలిసి అర్జీ ఇచ్చారు. రైతులకు అన్యాయం జరిగిందని.. వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ క్రమంలో కవిత అనే మహిళ వైఎస్సార్సీపీ వాళ్లే రైతులకు తక్కువ ధర చెల్లించి.. ప్రభుత్వం నుంచి ఎక్కువ ధర తీసుకున్నారన్నారు. రైతుల్ని మోసం చేశారని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో అక్కడ వాగ్వాదం జరిగింది. ఇదంతా చూసిన మాజీ మంత్రి బాలినేని సంయమనం కోల్పోయారు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై విరుచుకుపడ్డారు. చెప్పలేని భాషలో బూతు పురాణం అందుకున్నారు. ఇదంతా జనార్దనే చేయిస్తున్నాడని.. అంతుచూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో స్థానికుల్ని పోలీసులు అక్కడి నుంచి పంపారు. తర్వాతఈ గొడవ సద్దుమణిగింది. మాజీ మంత్రి బూతు పురాణం వీడియోను టీడీపీ ట్వీట్ చేసింది. సమస్యలపై చెబితే సహనం కోల్పోయు అసభ్య పదజాలం వాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలో అక్కడ వాగ్వాదం జరిగింది. ఇదంతా చూసిన మాజీ మంత్రి బాలినేని సంయమనం కోల్పోయారు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై విరుచుకుపడ్డారు. చెప్పలేని భాషలో బూతు పురాణం అందుకున్నారు. ఇదంతా జనార్దనే చేయిస్తున్నాడని.. అంతుచూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో స్థానికుల్ని పోలీసులు అక్కడి నుంచి పంపారు. తర్వాతఈ గొడవ సద్దుమణిగింది. మాజీ మంత్రి బూతు పురాణం వీడియోను టీడీపీ ట్వీట్ చేసింది. సమస్యలపై చెబితే సహనం కోల్పోయు అసభ్య పదజాలం వాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.