యాప్నగరం

ప్రకాశం: 108 వాహనంలో మంటలు.. రోగిని తీసుకెళుతుండగానే ప్రమాదం

108 Fire Accident కలకలంరేపింది. డయాలసిస్ కోసం 108 వాహనంలో పేషెంట్‌తో తీసుకుని వెళుతున్నారు.. ఇంతలో వాహనంలోనుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే పైలెట్ అప్రమత్తమై వాహనాన్ని ఆపేసి.. రోగితో పాటూ మరొకర్ని కిందకు దించేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే వాహనం నుంచి నిప్పులు పైకి రేగడంతో పక్కనే ఉన్న పొగాకు మండెలపై పడింది. ఈ ఘటనలో ఆస్తి నష్టం ఏర్పడింది. అలాగే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 14 Mar 2023, 9:06 am

ప్రధానాంశాలు:

  • ప్రకాశం జిల్లాలో ప్రమాదం జరిగింది
  • 108 వాహనంలో నుంచి మంటలు రేగాయి
  • ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Prakasam 108 Fire
ప్రకాశం జిల్లాలో రోగిని తరలిస్తున్న 108 అంబులెన్స్‌లో మంటలు రేగడం కలకలంరేపింది. ప్రకాశం జిల్లా పామూరు మండలం రజాసాహెబ్‌పేటకు చెందిన ఏసురాజు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. అతడిని డయాలసిస్‌ కోసం కందుకూరు తీసుకువెళ్లేందుకు కుటుంబసభ్యులు 108కు ఫోన్‌ చేశారు. అక్కడికి చేరుకున్న వాహనం ఏసురాజును ఎక్కించుకుని కొద్ది దూరం వెళ్లేసరికి. ఉన్నట్టుండి డ్రైవర్‌ క్యాబిన్‌లో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన పైలెట్‌ తిరుపతిరావు వాహనాన్ని ఆపేశారు. ఈఎంటీ మధుసూదన్‌రెడ్డిని అప్రమత్తం చేశారు.. ఆ వెంటనే లోపలున్న రోగి, ఆమె తల్లిని కిందకు దించారు.
కొద్దిసేపటికే వాహనం అంతటికీ మంటలు విస్తరించాయి. లోపలున్న ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలడంతో.. ఆ దెబ్బకు వాహనం శకలాలు ఎగిరి సమీపంలోని పొగాకు మండెలపై పడ్డాయి. ఈ ఘటనలో రజాసాహెబ్‌పేటకు చెందిన రైతులు పొన్నగంటి నరసింహం, పద్మ, జయమ్మకు చెందిన.. రూ.40 లక్షలకు పైగా విలువైన పొగాకు పూర్తిగా దగ్థమైంది. ఈ ఘటనలో వాహనానికి సంబంధించిన శకలాలు తగిలి సాధినేని వరదయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.

క్షత్రగాత్రుడ్ని హుటాహుటిన ఒంగోలులో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో జనాలు భయపడ్డారు. సమాచారకం అందుకున్న మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రుడిని పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 108లో ఉండే ఆక్సిజన్ సిలిండర్ వలన మంటలు తీవ్రంగా వ్యాప్తి చెందాయంటున్నారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధం అయ్యింది.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.