రాష్ట్రంలో ఓటీఎస్ విధానంపై అధికార, ప్రతిపక్షాలు ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటున్న సమయంలో.. ఓటీఎస్ విధానాన్ని ఒక వలంటీర్ వ్యతిరేకించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలానికి చెందిన ఒక వలంటీర్ జగనన్న గృహ హక్కు పథకం కింద వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ కింద ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ వలంటీర్గా రాజీనామా చేశారు. గిద్దలూరు మండలం కొంగలవీడు గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న గ్రామ వలంటీర్ గోళ్ల విష్ణు వర్ధన్ రాజు యాదవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఓటిఎస్ పథకంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు, ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు తనకు నచ్చలేదని అన్నాడు. అసలే ప్రజలు పెరిగిన అధిక ధరలతో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఓటీఎస్ పేరుతో గృహ లబ్ధిదారుడు వద్ద నుంచి రూ.10 వేలు వసూలు చేయమంటూ ఒత్తిడి తేవడం తనకు ఆవేదన కలిగించిందని అన్నాడు.
సీఎం జగనన్న నవరత్నాల పథకాలతో పేద ప్రజల జీవితాలలో వెలుగులు తెస్తాడని ఈ ప్రభుత్వంలో వలంటరీగా చేరానని.. అయితే ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం వలన రాష్ట్ర ప్రజలు అంధకారంలోకి వెళ్లారని లేఖలో పేర్కొన్నాడు. అనంతరం గిద్దలూరు టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో విష్ణు వర్ధన్ రాజు టీడీపీ కండువా కప్పుకున్నారు.
సీఎం జగనన్న నవరత్నాల పథకాలతో పేద ప్రజల జీవితాలలో వెలుగులు తెస్తాడని ఈ ప్రభుత్వంలో వలంటరీగా చేరానని.. అయితే ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం వలన రాష్ట్ర ప్రజలు అంధకారంలోకి వెళ్లారని లేఖలో పేర్కొన్నాడు. అనంతరం గిద్దలూరు టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో విష్ణు వర్ధన్ రాజు టీడీపీ కండువా కప్పుకున్నారు.