యాప్నగరం

బైక్‌పై ముగ్గురు 9వ తరగతి విద్యార్థులు.. నెల్లూరులో ఊహకందని విషాదం

నెల్లూరు జిల్లాలో ఊహకందని విషాదం మంగళవారం చోటు చేసుకుంది. 9వ తరగతి విద్యార్థులు ముగ్గురు రోడ్డుపై వేగంగా బైక్‌పై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన మరో బండి..!

Samayam Telugu 26 Jan 2021, 6:33 pm
నెల్లూరు జిల్లా వెంకటగిరి- ఏర్పేడు జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటగిరి పట్టణానికి చెందిన 9వ తరగతి విద్యార్థులు కౌశిక్‌, విష్ణు, భార్గవ్ కలిసి ద్విచక్రవాహనంలో మిత్రులను కలిసేందుకు పల్లంపేటకు వెళ్తుండగా ఎదురుగా మరో వాహనంలో వస్తున్న మెకానిక్‌ నాగరాజు వాహనాన్ని ఢీకొట్టారు. వేగంగా వస్తున్న ఈ రెండు వాహనాలు పరస్పరం బలంగా ఢీకొన్నాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం

ఈ ప్రమాదం తీవ్రతకు ఆ నలుగురు చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ఘటనలో నాగరాజు, కౌశిక్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా భార్గవ్‌, విష్ణు గాయపడ్డారు. ప్రమాదం నుంచి తేరుకున్న విష్ణు ఘటనాస్థలం నుంచి పరారవగా.. భార్గవ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఈ సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి సీఐ కృష్ణ మోహన్‌ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలం నుంచి పరారైన విద్యార్థి విష్ణు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.