బాపట్ల జిల్లాలో ఆదివారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కొరిశపాడు మండలం దైవాల రావూరులో ఆటాడుకుంటూ బాదం చెట్టు ఎక్కిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు కరెంటు తీగలపై పడిపోయారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. విద్యుదాఘాతంతో మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలుడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
రావూరు గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఆదివారం కావటంతో.. స్థానికంగా ఉన్న సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న బాదం చెట్టుపై ఎక్కి ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో చెట్టు మధ్యలో ఉన్న కరెంటు తీగలు గమనించక ముందుకు వెళ్లారు. దీంతో విద్యుదాఘాతానికి గురైన ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక మరో బాలుడు కరెంట్ షాక్ దెబ్బకు కింద పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు.
మృతి చెందిన చిన్నారి గడ్డం బుజ్జి కుమారుడు అఖిల్గా స్థానికులు గుర్తించారు. మరొక బాలుడిని చికిత్స నిమిత్తం మేదరమెట్లలోని ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రాణం విడిచి చెట్టు మీదే పడి ఉన్న చిన్నారి అఖిల్ మృతదేహాన్ని చూసి గ్రామస్తులంతా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రావూరు గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఆదివారం కావటంతో.. స్థానికంగా ఉన్న సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న బాదం చెట్టుపై ఎక్కి ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో చెట్టు మధ్యలో ఉన్న కరెంటు తీగలు గమనించక ముందుకు వెళ్లారు. దీంతో విద్యుదాఘాతానికి గురైన ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక మరో బాలుడు కరెంట్ షాక్ దెబ్బకు కింద పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు.
మృతి చెందిన చిన్నారి గడ్డం బుజ్జి కుమారుడు అఖిల్గా స్థానికులు గుర్తించారు. మరొక బాలుడిని చికిత్స నిమిత్తం మేదరమెట్లలోని ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రాణం విడిచి చెట్టు మీదే పడి ఉన్న చిన్నారి అఖిల్ మృతదేహాన్ని చూసి గ్రామస్తులంతా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.