ప్రకాశం జిల్లాలో కొండ చిలువ కలకలంరేపింది. మార్టూరు మండలం కోలాలపూడి జెడ్పీ హైస్కూల్లో ప్రత్యక్షమైంది. స్కూలుకు వచ్చిన కొందరు విద్యార్థులు ఆట వస్తువుల కోసం స్పోర్ట్స్ రూమ్ దగ్గరకు వెళ్లారు. డోర్ తీసి వస్తువుల్ని తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈలోపు ఓ పట్ట కింద ఏదో కదులుతున్నట్లు అనింపించింది. అలికిడి కూడా రావడంతో అనుమానం వచ్చింది. వెంటనే విద్యార్థులు పట్ట తొలగించి చూస్తే గుండె ఆగినంత పని అయ్యింది. ఆ పట్ట కింద విద్యార్థులకు పెద్ద కొండ చిలువ కనిపించింది. దాదాపు ఆరు అడుగులపైగా పొడవు ఉన్న కొండ చిలువను చూసి అవాక్కయ్యారు. ఆ రూమ్లో నుంచి భయంతో విద్యార్దులు బయటకు పరుగులు తీశారు. వెంటనే టీచర్లకు విషయం చెప్పడంతో వారు స్థానికుల సాయం కోరారు. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన జనాలు కొండ చిలువను జాగ్రత్త పట్టుకుని ఓ గోతంలో బంధించారు. ఆ తర్వాత స్కూల్ సిబ్బంది ఫారెస్ట్ ఆధికారులకు సమాచారం అందించారు. కొండ చిలువను తీసుకెళ్లి జాగ్రత్తగా ఊరి శివారులో వదిలివేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో కొండచిలువ వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ప్రకాశం: స్కూల్లో ఓ రూమ్ డోర్ తీసిన విద్యార్థులు.. లోపల అలా చూడగానే, బాబోయ్ గుండె ఆగినంత!
కొందరు విద్యార్థులు ఆట వస్తువుల కోసం స్పోర్ట్స్ రూమ్ దగ్గరకు వెళ్లారు. డోర్ తీసి వస్తువుల్ని తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈలోపు ఓ పట్ట కింద ఏదో కదులుతున్నట్లు అనింపించింది.
Samayam Telugu 3 Dec 2021, 11:18 am
ప్రధానాంశాలు:
- మార్టూరు సమీపంలో
- స్కూల్లో కొండ చిలువ
- అవాక్కైన విద్యార్థులు