యాప్నగరం

ప్రకాశం: పత్తి చేను మధ్యలో పాడు పని.. అడ్డంగా దొరికిపోయారు ఇలా..

బేస్తవారిపేట మండలంలోని చెన్నుపల్లికి చెందిన లక్కమనేని చెంచమ్మ అనే మహిళా రైతు సమీప పొలాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఎవరూ గుర్తించకుండా ఉండేలా అందులో ఆ మొక్కలు నాటారు.

Samayam Telugu 22 Oct 2021, 7:47 am

ప్రధానాంశాలు:

  • ప్రకాశం జిల్లా బేస్తవారిపేట సమీపంలో ఘటన
  • పత్తి చేనులో గుర్తు పట్టకుండా గంజాయి సాగు
  • ఆ మొక్కల్ని ధ్వంసం చేసిన SEB అధికారులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లాలో SEB తనిఖీలు కలకలంరేపాయి. ఓ చోట పత్తి చేనును గమనించి అనుమానం వచ్చింది.. వెంటనే పరిశీలిస్తే దిమ్మ తిరిగింది. పత్తి చేను మాటున గంజాయి సాగవుతుందని తేల్చారు. గంజాయి సాగు చేస్తున్నట్లు ఎస్ఈబీ అధికారులకు సమాచారం అందడంతో వెంటనే ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. చెంచమ్మ అనే మహిళ గ్రామ శివారుల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు.
బేస్తవారిపేట మండలంలోని చెన్నుపల్లికి చెందిన లక్కమనేని చెంచమ్మ అనే మహిళా రైతు సమీప పొలాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఎవరూ గుర్తించకుండా ఉండేలా అందులో అక్కడక్కడ గంజాయి మొక్కలు నాటారు. సమాచారం అందుకున్న సెబ్‌ అధికారులు గురువారం దాడి చేశారు. చెంచమ్మ పొలంలో సాగు చేసిన 310 గంజాయి మొక్కలను గుర్తించి పీకి వేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. గంజాయి. సాగు నేరమని.. ఒకవేళ ఎవరైనా సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని SEB అధికారులు హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.