యాప్నగరం

ఒంగోలు: రైలు పట్టాలపై ప్రేమ జంట.. భయంతో వణికిపోయిన జనాలు!

Tangutur: ప్రకాశం జిల్లాలో మరో ప్రేమ జంట రైలు కింద పడి ప్రాణాలు తీసుకుంది. వారం రోజులు గడవకముందే మరో ప్రేమ జంట..!

Samayam Telugu 23 Mar 2021, 3:43 pm
ప్రకాశం జిల్లాలో వారం రోజులు గడవకముందే మరో ప్రేమ జంట రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సురారెడ్డిపాలెంలో మంగళవారం ఉదయం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలుకు చెందిన విష్ణువర్ధన్‌ (22), ఒంగోలు, వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇందు (18) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇద్దరూ సూరారెడ్డిపాలెం ట్రాక్‌ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రైలు పట్టాల వద్ద భీతావహ పరిస్థితులు చూసి ప్రజలు భయంతో వణికిపోయారు.
Samayam Telugu టంగుటూరు రైల్వే స్టేషన్


Don't Miss: ఒంగోలు: చిన్న వయసులో పీకల్లోతు ప్రేమ.. బతికే దారి కనిపించక.. షాకింగ్!

ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రేమ జంట ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

కాగా, వారం రోజుల క్రితం ఒంగోలు నగర శివారు పెళ్లూరు సమీపంలో ప్రేమ జంట రైలు కిందపడి ప్రాణాలు తీసుకుంది. స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే ట్రాక్‌పై మృతదేహాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. ఈ ఘటనను పూర్తిగా మర్చిపోక ముందే మరో జంట ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.