యాప్నగరం

జగన్ అన్న.. నాకు ప్రాణహాని ఉంది.. కన్నీరు పెట్టిస్తున్న యువతి కథ!

village secretariat employee: జగన్ అన్న నాకు ప్రాణహాని ఉంది.. కాపాడండి అని ఓ మహిళా ఉద్యోగి వేడుకుంది. ఓ కానిస్టేబుల్ తనను మోసం చేశారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయింది. తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని భయాందోళన వ్యక్తం చేసింది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 9 Jan 2023, 9:49 pm
village secretariat employee: తనను కాపాడాలని ఓ మహిళా ఉద్యోగి ముఖ్యమంత్రి జగన్‌ను వేడుకున్నారు. తనకు ప్రాణ హాని ఉందని భయాందళన వ్యక్తం చేశారు. 'జగనన్న నాపేరు శ్యామల. నేను ప్రకాశం జిల్లా మైనంపాడు గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. ఏఆర్ కానిస్టేబుల్ పల్లెపాటి అర్జున్ నన్ను మాయ మాటలతో నమ్మించి మోసం చేశాడు. గర్భవతిని చేసి.. బలవంతంగా భ్రూణహత్య చేయించినాడు. మోసం చేయడమే కాకుండా చంపుతానని బెదిరిస్తున్నాడు. ఆరో తేదీన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. కానీ.. ఈరోజు వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. పోలీసు అయిన కారణంగా అర్జున్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. నాకు న్యాయం చేయడం లేదు. మీరే నాకు న్యాయం చేసి.. రక్షణ కల్పించండి' అని శ్యామల వేడుకున్నారు.
Samayam Telugu victim
బాధితురాలు

రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.