యాప్నగరం

ప్రకాశం: బతికున్న భర్త పేరుతో డెత్ సర్టిఫికేట్.. భార్య కన్నింగ్ ప్లాన్ తెలిసి అధికారులు అవాక్కు

Pension Death Certificate Cheating బయటపడింది. ఓ మహిళ ఇటీవల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే విచారణ జరిగే క్రమంలో ఆమె సమర్పించిన భర్త డెత్ సర్టిఫికేట్ విషయంలో ఊహించని ట్విస్ట్ బయటపడింది. ఆమె భర్త బతికుండగానే పింఛన్ కోసం డెత్ సర్టిఫికేట్ తీసుకున్నట్లు తేలింది. ఈ విషయం తెలియడంతో బాధితుడు అవాక్కయ్యాడు.. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే 9 ఏళ్లగా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నట్లు తేలింది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 25 Apr 2023, 9:42 am

ప్రధానాంశాలు:

  • ప్రకాశం జిల్లాలో డెత్ సర్టిఫికేట్ మోసం
  • భర్త బతికుండగానే భార్య ఘనకార్యం
  • భర్త చెప్పడంతో బయటపడిన వ్యవహారం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Prakasam District Pension Death Certificate Chrating
పింఛన్ కోసం ఓ మహిళ కన్నింగ్ ప్లాన్ వేసింది. పింఛన్ కోసం ఏకంగా బతికున్న భర్త చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ విషయం తెలిసి భర్త అవాక్కయ్యాడు.. వెంటనే అధికారులతో పాటుగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలిసి సచివాలయ సిబ్బంది, అధికారులు అవాక్కయ్యారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటన హాట్ టాపిక్ అయ్యింది.
కొండెపి మండలం వెన్నూరుకు చెందిన కంకిపాటి నారాయణకు 30 ఏళ్ల క్రితం మర్రిపూడి మండలం కూచిపూడికి చెందిన మహిళతో వివాహమైంది. ఇద్దరు పిల్లలు కాగా.. తొమ్మిదేళ్ల క్రితంభార్యాభర్తల మధ్య మనస్పర్థలతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. ఇంతలో ఆ మహిళ తన భర్త చనిపోయాడని జరుగుమల్లి మండలం ఎన్‌.ఎన్‌.కండ్రిక సచివాలయం సెక్రటరీ సంతకంతో ఉన్న డెత్ సర్టిఫికేట్‌తో.. కూచిపూడి సచివాలయంలో పింఛనుకు దరఖాస్తు చేసుకుంది.

ఈ క్రమంలో నారాయణకు ఈ విషయం తెలిసింది. అప్పుడు అసలు కథ బయటపడింది.తాను బతికుండగానే భార్య చనిపోయినట్టు సర్టిఫికెట్‌ తీసుకుందని చెప్పాడు. వెంటనే జరుగుమల్లి పోలీసులను ఆశ్రయించాడు. తాను ఉపాధి పథకంలో పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నానని.. ఒకవేళపింఛను మంజూరై ఉంటే తన ఉపాధి పోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే అధికారుల వాదన మరోలా ఉంది.. ఈ ఏడాది జారీ చేసిన డెత్ సర్టిఫకేట్లలో నారాయణ పేరు లేదంటున్నారు.. బహుశా అది నకిలీది కావొచ్చన్నారు.
ఈ ఘటనతో సచివాలయ సిబ్బంది కూడా అవాక్కయ్యారు. అయితే ఓ రాజకీయ నేత ప్రోద్బలంతో డెత్ సర్టిఫికెట్‌ వచ్చిందా అని ప్రచారం జరుగుతోంది. భార్య కూడా ఒంటరి మహిళగా ఉండటంతో తన జీవనం కోసం పింఛన్ వస్తుందని ఆశపడి దరఖాస్తు చేసుకుంది.. కాకపోతే డెత్ సర్టిఫికేట్‌తో అడ్డంగా దొరికిపోయింది. అయితే ఇది ఫేక్ సర్టిఫికేటా.. నిజంగానే ఆ పత్రం తీసుకుందా అన్నది తేలాల్సి ఉంది. భర్త ఫిర్యాదుతో అధికారులు ఈ డెత్ సర్టిఫికేట్ ఎపిసోడ్‌పై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు సాధారణంగా భర్తతో విడిపోయిన భార్యలకు ఒంటరి మహిళ పేరుతో పింఛన్ అందిస్తారు.. కానీ ఇక్కడ మాత్రం ఆమె డెత్ సర్టిఫికేట్ తేవడం ఆసక్తికరంగా మారింది. వారిద్దరు అధికారికంగా విడాకులు తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈ మహిళ చేసిన పనితో అందరూ అవాక్కయ్యారు. గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి తరహాలో ఒకటి రెండు ఘటనలు కూడా జరిగాయి.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.