యాప్నగరం

ప్రకాశం: లారీతో ఢీకొట్టి వైసీపీ నేత దారుణ హత్య.. పార్టీలోని మరో వర్గంపై ఆరోపణలు!

Singarayakonda Ysrcp Leader Murder కలకలంరేపింది. స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళుతున్న సమయంలో.. యువకుడిని వెనుక నుంచి లారీ ఢీకొట్టి హత్య చేశారు. అతడి స్నేహితుడు లారీ ఆపేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పారిపోయారు. స్థానికంగా కలకలంరేపిన ఘటన. వైఎస్సార్‌సీపీలోని మరో వర్గంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైస్ ఎంపీపీ పదవి విషయంలో వివాదమే ఈ హత్యకు కారణమని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్తగా స్థానికంగా పోలీసుల్ని భారీగా మోహరించారు. మృతుడి తండ్రి మాజీ సర్పంచ్.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 23 Sep 2022, 8:40 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Singarayakonda Ysrcp Leader Murder
ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య కలకలంరేపింది. పాత కక్షలతో హైవేపై యువకుడిని లారీతో ఢీకొట్టి హత్య చేశారని తండ్రి ఆరోపిస్తున్నారు. సింగరాయకొండ మండలం మూలగుంటపాడుకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత పసుపులేటి రవితేజ రాత్రి 8.30 గంటల సమయంలో స్నేహితుడు ఉమతో కలిసి వేర్వేరు బైకులపై కనుమళ్లకు వెళుతున్నారు. ఇంతలో వెనుక నుంచి లారీతో అతడిని ఢీకొట్టడంతో రోడ్డు మీద పడిపోయాడు.. అనంతరం లారీ అతడిని తొక్కుకుంటూ వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో రవితేజ అక్కడికక్కడే చనిపోయాడు.
ఘటన తర్వాత రవితేజ స్నేహితుడు లారీని ఆపేందుకు ప్రయత్నించాడు. అతడిపైకి కూడా లారీని పోనిచ్చేందుకు డ్రైవర్‌ ప్రయత్నించగా తప్పించుకున్నట్లు చెబుతున్నాడు. రవితేజ మూలగుంటపాడులో ఉంటుండగా.. భార్య, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. రవితేజ సోమరాజుపల్లి మాజీ సర్పంచి పసుపులేటి శ్రీనివాసరావు కుమారుడు. ఇదిలా ఉంటే.. తన కుమారుడిది పక్కాగా హత్య అంటున్నారు రవితేజ తండ్రి శ్రీనివాసరావు. ఈ ఘటనతో మూలగుంటపాడులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా.. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

సింగరాయకొండ వైఎస్ ఎంపీపీ పదవి విషయంలో వివాదంతోనే ఈ హత్య జరిగిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ పదవి ఆశించిన స్థానిక మరో వైఎస్సార్‌సీపీ నేత హస్తం ఉందని చెబుతున్నారు. ఇద్దరు నేతలు ఈ పదవి కోసం పోటీపడగా.. ఓ వర్గానికి రవితేజ అనుకూలంగా వ్యవహరించారట. ఆ సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం కనిపించింది. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య దాడులు జరిగి.. పోలీస్ స్టేషన్‌లో కేసులు కూడా పెట్టుకున్నారు. ఇద్దరు ఒకే పార్టీ కావడంతో అప్పట్లో రాజీ కూడా జరిగింది అంటున్నారు. ఈ వివాదంతోనే ఇప్పుడు రవితేజను లారీతో ఢీకొట్టి చంపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ సంఘటనపై ఫిర్యాదు అందిందని.. హత్యకేసు నమోదు చేస్తున్నట్లు ఒంగోలు డీఎస్పీ తెలిపారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.