యాప్నగరం

YSRCP ఎంపీ, ఎమ్మెల్యేకు క్లాస్ పీకిన సీఎం జగన్.. సీరియస్ వార్నింగ్!!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Samayam Telugu 28 Sep 2021, 11:43 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్ రామ్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైసీపీ నేతల పంచాయితీ ముగిసింది. రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పిలిపించి సీఎం జగన్‌ మాట్లాడారు. పరస్పరం బహిరంగ ఆరోపణలు చేసుకోవడంపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Samayam Telugu ఎంపీ మార్గాని భరత్ Vs జక్కంపూడి రాజా


పార్టీ గీత దాటితే చర్యలు తప్పవని సీఎం జగన్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. అంతకు ముందు తూర్పు గోదావరి జిల్లా పర్యవేక్షకుడు వైవీ సుబ్బారెడ్డి రెండు విడతలుగా భరత్, జక్కంపూడి రాజాతో భేటీ అయ్యారు. ఇద్దరితో విడివిడిగా మాట్లాడి సుబ్బారెడ్డి వివరణ తీసుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి ఈ పంచాయితీ కొనసాగింది. మంగళవారం సమావేశంపై బుధవారం మీడియాతో మాట్లాడతానని ఎంపీ భరత్‌ తెలిపారు.

ఇద్దరి మధ్య అసలేం జరిగిందంటే..
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉండగా.. కొందరు రైతులతో రాజమహేంద్రవరంలో బ్యాంకు ఖాతాలు తెరిపించి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడే ప్రయత్నాలు చేశారని ఎంపీ భరత్‌పై జక్కంపూడి రాజా ఇటీవల పరోక్ష విమర్శలు గుప్పించారు. దీనిపై ఎంపీ భరత్‌ మాట్లాడుతూ.. చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసుని తనపై అభియోగాలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదంపై అధిష్టానం జోక్యం చేసుకోగా.. సీఎం జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.