యాప్నగరం

గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం.. ఏపీ డీజీపీ

Samayam Telugu 26 Oct 2021, 10:43 pm
గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసు శాఖ సమాయత్తమైంది. ఈ మేరకు రాజమహేంద్రవరంలో ఎస్పీలు, ఉన్నతాధికారులతో మాదకద్రవ్యాల నియంత్రణపై డీజీపీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలో నెలరోజులుగా గంజాయిపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు.
Samayam Telugu డీజీపీ గౌతం సవాంగ్


ఈ సంవత్సరం మూడు లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ తెలిపారు. ముంద్ర పోర్టులో పట్టుబడిన హెయిరాన్‌కి.. పశ్చిమ గోదావరి జిల్లాలో డ్రగ్స్ పట్టుబడినట్లుగా జరుగుతున్న ప్రచారంపై ఏపీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో కలిసి పనిచేస్తూ గంజాయి సాగు, రవాణాను నియంత్రించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అసత్య ఆరోపణలు మానుకోవాలని సూచించారు.

ఆంధ్రా-ఒడిశా మధ్య గంజాయి సమస్య దశాబ్దాలుగా ఉందని, ఎన్ఐఏ సహకారంతో సమస్యను పరిష్కరిస్తామని డీజీపీ తెలిపారు. ఇప్పటికే 463 మంది అంతర్ రాష్ట్ర నిందితులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టామని.. గత పదేళ్ల కంటే ఏడాదిలో కొన్ని రెట్లు అధికంగా గంజాయి స్వాధీనం చేసుకున్నామని గౌతమ్ సవాంగ్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.