యాప్నగరం

YSRCP కార్యకర్తల్లో నిరుత్సాహం.. మంత్రి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు

తుని నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ప్లీనరీ నిర్వహించారు. ఈ సమావేశంలో నిరుత్సాహానికి గురి అయ్యానంటూ మంత్రి దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 29 Jun 2022, 11:55 am

ప్రధానాంశాలు:

  • కొందరు కార్యకర్తలు, నేతల్లో నిరుత్సాహం
  • టీడీపీ హయాంలో కూడా అవినీతి జరిగింది
  • జగన్ పారదర్శకమైన పాలనతో కుదరలేదు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu మంత్రి రాజా
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ (YSRCP) ఫ్లీనరీలో మంత్రి దాడిశెట్టి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత టీడీపీ (TDP) హయాంలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అందరు సంపాదించుకున్నారని చెప్పుకొచ్చారు. అలాంటి భావనే 'మన' (వైఎస్సార్‌సీపీ) కార్యకర్తల్లో కూడా కొంతమందికి ఉండేది అన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ పారదర్శకమైన పరిపాలన అందించడంతో అది కుదరలేదని వ్యాఖ్యానించారు. అందుకే కొందరు కార్యకర్తలు, నాయకులు కొంత నిరుత్సాహానికి గురి అయ్యారని.. ఇది వాస్తవమని మంత్రి వ్యాఖ్యానించారు.
తాను కూడా 'మీలానే' (కార్యకర్తల్లా) నిరుత్సాహానికి గురి అయ్యానంటూ కార్యకర్తలకి మంత్రి దాడిశెట్టి రాజా చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో ఏ పథకం అమలు కావాలన్నా జన్మభూమి కమిటీ మెంబెరే అమలు చేసేవారని గుర్తు చేశారు. అందుకే వారు బాత్రూముల పథకంతో పాటు మిగిలిన పథకాల్లో కూడా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అయితే నిరుత్సాహం అంటూ మంత్రి రాజా పార్టీ ప్లీనరీలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.