యాప్నగరం

ఓ సలహా వారి కొంపముంచింది.. ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో..

రైల్లో 18 నెలల పసి పాప కిడ్నాప్ కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. గౌతమఘాట్‌లో మేఘనను గుర్తించిన పోలీసులు.. అనంతరం రామకృష్ణ దంపతులను పట్టుకున్నారు. పసిపాపను తల్లిదండ్రులకు అప్పగించారు.

Samayam Telugu 17 Oct 2021, 7:31 am
ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశపడ్డారు. చిత్తు కాగితాలు ఏరుకునే మహిళకు దంపతులు ఓ సలహా ఇచ్చారు. వారి సలహాను ఆమె పక్కాగా అమలు పరిచింది. అయితే చివరికి బేరం రాకపోవంతో ముగ్గురు పోలీసులకు దొరికిపోయారు. ఈ ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.
Samayam Telugu రాజమహేంద్రవరం


రైల్లో 18 నెలల పసి పాప కిడ్నాప్ కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. జీఆర్పీ స్టేషనులో డీఎస్‌ఆర్పీ బి.వి.ఎస్‌.నాగేశ్వరరావు తెలిపిన వివరాలు.. రాజమహేంద్రవరం రూరల్ మండలం నామవరానికి చెందిన ఎం.భవాని అలియాస్‌ మేఘన (25) చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవిస్తోంది. ఆమె ఇంటి పక్కనే ఉంటున్న పి.రామకృష్ణ, వెంకటరత్నం దంపతులు చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి.. అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని సలహా ఇచ్చారు.

దీంతో గత నెల 30న విశాఖ-కాచిగూడ రైలులో ప్రయాణిస్తున్న ఒడిశాకు చెందిన సుభాష్‌ ఛత్రియ కుటుంబంతో మేఘన పరిచయం పెంచుకుంది. వారు నిద్రపోయిన తరువాత అర్ధరాత్రి వారి పాప (18 నెలలు)ను కిడ్నాప్ చేసి.. రాజమహేంద్రవరంలో దిగిపోయింది. అయితే ట్రైన్ నిడదవోలు చేరుకున్నాక గుర్తించిన తల్లిదండ్రులు.. తమ పాప కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించారు.

కిడ్నాప్ చేసిన పాపను మేఘన.. హుక్కుంపేటలోని రామకృష్ణ దంపతులకు అప్పగించి వెళ్లిపోయింది. అయితే ఈ పాపకు బేరం రాకపోవడంతో రామకృష్ణ తమ దగ్గరే ఉంచుకున్నాడు. గౌతమఘాట్‌లో మేఘనను గుర్తించి.. పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రామకృష్ణ దంపతులను పట్టుకుని.. పసిపాపను తల్లిదండ్రులకు అప్పగించారు.


,చూన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.