టీడీపీలోకి వైఎస్సార్సీపీ నేత చేరికకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నేత బొడ్డు వెంకట రమణ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 6న తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజవర్గం కోరింగలో జరిగే బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అక్కడ వెంకట రమణ టీడీపీ కండువా కప్పుకొనున్నారు.. వాస్తవానికి ఈ నెల 3న పార్టీలో చేరాల్సి ఉన్నా వాయిదా పడింది. బొడ్డు వెంకట రమణ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన దివంగత నేత, సీనియర్ రాజకీయవేత్త బొడ్డు భాస్కర రామారావు తనయుడు. గతవారం ఆయన మాజీ మంత్రి చిన రాజప్ప, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. వెంకట రమణ పార్టీలో చేరేందుకు సముఖత చూపించగా.. అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకటరమణ 2014లో వైఎస్సార్సీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీకి దూరంగా ఉంటున్నారు.
వెంకట రమణ తండ్రి భాస్కర రామారావు మరణంత తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవ్వాలని భావించారు. అందుకే టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం వెంకటరమణ అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించి టీడీపీలో చేరాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పనిచేస్తాను అంటున్నారు. వెంకటరమణ రాకతో పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం అవుతుందంటున్నారు ఆ పార్టీ నేతలు. ఈ నియోజకవర్గం నుంచి మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యంవహిస్తున్న సంగతి తెలిసిందే.
వెంకట రమణ తండ్రి భాస్కర రామారావు మరణంత తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవ్వాలని భావించారు. అందుకే టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం వెంకటరమణ అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించి టీడీపీలో చేరాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పనిచేస్తాను అంటున్నారు. వెంకటరమణ రాకతో పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం అవుతుందంటున్నారు ఆ పార్టీ నేతలు. ఈ నియోజకవర్గం నుంచి మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యంవహిస్తున్న సంగతి తెలిసిందే.