మాజీ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (Jd Lakshminarayana) విచిత్రమైన సమస్య వచ్చిపడింది. లక్ష్మీనారాయణ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం, రాచపల్లి గ్రామాల పరిధిలో దాదాపు 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. గత కొనేళ్లుగా ఈ వ్యవసాయ క్షేత్రాన్ని కౌలుకు తీసుకుని సేంద్రీయ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు. ఆ పొలంలో వరినాట్లు వేశారు. అలాగే తన పొలంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నట్లుగా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. తన పొలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ మాయమైందని ప్రత్తిపాడు పోలీసులను ఆశ్రయించారు. ఆ పొలంలో కాపలా ఉన్న దొరబాబు ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 1న రాత్రి నుంచి తన పంట పొలంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ కనబడటం లేదని లక్ష్మీనారాయణ చెబుతున్నారు. ఆయన పోలీసుల్ని కలిసి ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని ప్రత్తిపాడు పోలీసులు చెబుతున్నారు. తన పొలంలో ఫ్లెక్సీ ఎందుకు మాయం అయ్యింది.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తొలగించారా.. ఆకతాయిలు ఎవరైనా ఫ్లెక్సీ ఎత్తుకెళ్లారా అన్నది తేలాల్సి ఉంది. ఫ్లెక్సీ మిస్సింగ్పై మాజీ జెడి.లక్ష్మినారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారంటే.. ఇది ఎవరో కుట్రపూరితంగా చేశారనే అనుమానాలు కలుగుతున్నాయి అంటున్నారు.
వీవీ లక్ష్మీనారాయణ సీబీఐ జాయింట్ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు.. ఇండియన్ పోలీస్ సర్వీసెస్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అనంతరం 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరి విశాఖ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వత పార్టీ నుంచి బయటకు వ్యవసాయం పై మక్కువతో కాకినాడ జిల్లాలో పొలాన్ని కౌలుకు తీసుకున్నారు.. ఆ పొలంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఫ్లెక్సీ గురించి లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.
వీవీ లక్ష్మీనారాయణ సీబీఐ జాయింట్ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు.. ఇండియన్ పోలీస్ సర్వీసెస్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అనంతరం 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరి విశాఖ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వత పార్టీ నుంచి బయటకు వ్యవసాయం పై మక్కువతో కాకినాడ జిల్లాలో పొలాన్ని కౌలుకు తీసుకున్నారు.. ఆ పొలంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఫ్లెక్సీ గురించి లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.